NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Fine Rice: రాష్ట్రంలో దిగివస్తున్న సన్న బియ్యం ధరలు.. హోల్‌సేల్‌లో కిలోకు రూ.10-15 తగ్గుదల 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Fine Rice: రాష్ట్రంలో దిగివస్తున్న సన్న బియ్యం ధరలు.. హోల్‌సేల్‌లో కిలోకు రూ.10-15 తగ్గుదల 
    రాష్ట్రంలో దిగివస్తున్న సన్న బియ్యం ధరలు

    Fine Rice: రాష్ట్రంలో దిగివస్తున్న సన్న బియ్యం ధరలు.. హోల్‌సేల్‌లో కిలోకు రూ.10-15 తగ్గుదల 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 26, 2025
    08:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు దిగివస్తున్నాయి. ప్రభుత్వం సన్న వరి సాగును ప్రోత్సహించేందుకు క్వింటాకు ₹500 బోనస్ అందించడంతో, సాగు విస్తీర్ణం పెరిగి ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది.

    మార్కెట్‌లో సన్న బియ్యం అందుబాటులో ఎక్కువగా లభించడంతో, ధరలు తగ్గుముఖం పట్టాయి.

    తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇదే ప్రభావం కనిపిస్తోందని బియ్యం ఎగుమతిదారులు చెబుతున్నారు.

    బోనస్ ప్రకటించే ముందు,రాష్ట్రంలో ప్రీమియం రకం సన్న బియ్యం ధరలు కిలోకు ₹60-₹70 వరకు ఉండేవి.

    ప్రస్తుతం ఇవి ₹50-₹55కే లభిస్తున్నాయి.అలాగే,ఫైన్ రకం బియ్యం గతంలో ₹55-₹60 ఉండగా,ఇప్పుడు ₹43-₹48 మధ్యగా ఉంది. ఈ ధరలు హోల్‌సేల్ మార్కెట్‌కి సంబంధించినవి.

    వివరాలు 

    సంపూర్ణంగా అమల్లోకి వచ్చిన బోనస్‌ పథకం 

    గతంతో పోలిస్తే రకాన్ని బట్టి కిలోకు ₹10-₹15 తగ్గాయి. అయితే, రిటైల్ వ్యాపారులు కేవలం ₹5-₹8 మేరకే తగ్గిస్తున్నారు.

    కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర 'ఏ' గ్రేడ్‌కు ₹2,320, సాధారణ రకానికి ₹2,300.

    అయితే, తెలంగాణ ప్రభుత్వం సన్న వరి కోసం అదనంగా ₹500 బోనస్ అందించడంతో, మొత్తం కొనుగోలు ధర ₹2,820కి చేరింది.

    ఈ బోనస్‌ 2024 ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌ నుంచి అమల్లోకి వచ్చింది. 2023 ఖరీఫ్‌తో పోలిస్తే 2024 ఖరీఫ్‌లో సన్న బియ్యం ఉత్పత్తి 50% పెరిగింది.

    మొత్తం ధాన్యం ఉత్పత్తి 2023-24 ఖరీఫ్‌లో 144.80 లక్షల టన్నులుగా నమోదవగా, 2024-25లో 145.56 లక్షల టన్నులకు చేరింది.

    వివరాలు 

    ధరల తగ్గుదలపై ఇతర అంశాల ప్రభావం 

    ఇందులో 88.39 లక్షల టన్నుల సన్న ధాన్యం కాగా, 57.17 లక్షల టన్నులు దొడ్డు ధాన్యం. అధిక దిగుబడి కారణంగా మార్కెట్లోకి పెద్ద మొత్తంలో సన్న బియ్యం రావడంతో, ధరలు తగ్గాయి.

    తెలంగాణలో ప్రతి సీజన్‌లోనూ పొరుగు రాష్ట్రాల మిల్లర్లు, వ్యాపారులు సన్న బియ్యాన్ని పెద్దఎత్తున కొనుగోలు చేస్తుంటారు.

    సరఫరా పెరగడం వల్ల కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ధరలు తగ్గినట్లు రైస్ మిల్లర్లు వెల్లడిస్తున్నారు.

    వేరే రాష్ట్రాల సరఫరా: ఉత్తరప్రదేశ్, ఒడిశా,బీహార్‌ వంటి రాష్ట్రాల నుంచి తెలంగాణకు కూడా సన్న బియ్యం వస్తోంది.

    భారత్‌ బ్రాండ్‌ సబ్సిడీ బియ్యం: కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'భారత్‌ బ్రాండ్‌' పేరిట తక్కువ ధరకు బియ్యం విక్రయాలు ప్రారంభించింది.ఇది కూడా మార్కెట్‌పై ప్రభావం చూపింది.

    వివరాలు 

    ఉగాది తర్వాత మరింత ధరల తగ్గుదల అవకాశం 

    రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీకి సన్నద్ధమవుతోంది.

    దీంతో సన్న బియ్యం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ''ప్రస్తుతం బియ్యం మార్కెట్‌ మందగించింది.

    విక్రయాలు తగ్గాయి. రేషన్ కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలు సన్న బియ్యం కొనేందుకు ఆసక్తి చూపడం లేదు.

    అందరూ ప్రభుత్వ పంపిణీ కోసం వేచిచూస్తున్నారు'' అని తెలంగాణ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గణపతిరెడ్డి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    తెలంగాణ

    Half Day Schools: తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు  భారతదేశం
    TGPSC Group-3: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్షల ఫలితాలు విడుదల.. జనరల్‌ ర్యాంకింగ్స్‌ జాబితా ఇదిగో.. భారతదేశం
    TG News: తెలంగాణలో మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు భారతదేశం
    T- SAFE App: సురక్షిత ప్రయాణానికి 'టీ-సేఫ్‌'.. 35 వేలకుపైగా ప్రయాణాలకు భద్రతా వలయం! ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025