NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress: చేతులకు సంకెళ్లు వేసి అవమానించారు.. ఇలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నాం.. తప్పునుబట్టిన కాంగ్రెస్‌ 
    తదుపరి వార్తా కథనం
    Congress: చేతులకు సంకెళ్లు వేసి అవమానించారు.. ఇలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నాం.. తప్పునుబట్టిన కాంగ్రెస్‌ 
    చేతులకు సంకెళ్లు వేసి అవమానించారు.. ఇలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నాం.. తప్పునుబట్టిన కాంగ్రెస్‌

    Congress: చేతులకు సంకెళ్లు వేసి అవమానించారు.. ఇలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నాం.. తప్పునుబట్టిన కాంగ్రెస్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 05, 2025
    04:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తరలిస్తున్న విషయం విదితమే.

    ఈ పరిణామంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. భారతీయుల చేతికి సంకెళ్లు వేసి, నేరస్థులుగా చూపిస్తూ పంపించడం ఎంతో అవమానకరమని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఆవేదన వ్యక్తం చేశారు.

    ఓ భారతీయుడిగా అలాంటి దృశ్యాలు తాను చూడలేకపోతున్నానని ఆయన అన్నారు.

    వివరాలు 

    దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాడేకి అవమానం 

    2013లో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాడే అమెరికాలో ఎదుర్కొన్న అవమానాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

    న్యూయార్క్‌లో తన అధికారిక విధులు నిర్వహిస్తున్న సమయంలో, ఓ వీసా వ్యవహారంలో అక్కడి పోలీసులు ఆమెను అరెస్టు చేసి, అవమానించారని గుర్తు చేశారు.

    ఆ ఘటనకు నిరసనగా, అప్పటి యూపీఏ ప్రభుత్వ నేతలు భారత పర్యటనలో ఉన్న అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని కలవడానికి నిరాకరించారని చెప్పారు.

    అంతేకాకుండా, అమెరికా ఎంబసీకి అప్పటివరకు ఇచ్చిన అనేక ప్రోత్సాహకాలను భారత్ వెనక్కు తీసుకున్నట్లు తెలిపారు.

    వివరాలు 

    అమెరికాలో 7,25,000 మంది భారతీయ అక్రమ వలసదారులు

    అమెరికా నుంచి అక్రమ భారతీయ వలసదారులను తీసుకువస్తున్న ఈ విమానం మొదటిది కాదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తెలిపారు.

    బీజేపీ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.

    జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలోనూ 1100 మంది భారతీయ అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించిందని, అయితే వారి వివరాలను వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు.

    2022 నాటికి అమెరికాలో 7,25,000 మంది భారతీయ అక్రమ వలసదారులు ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయని వివరించారు.

    అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచూ కఠిన వైఖరి పాటిస్తున్నారు.

    అక్రమంగా నివసిస్తున్న విదేశీ వలసదారులను స్వదేశాలకు పంపే విధానాన్ని ఆయన కొనసాగిస్తున్నారని తెలియజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    కాంగ్రెస్

    Assembly Polls: ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌లకు కాంగ్రెస్ దూరం మహారాష్ట్ర
    congress: అమెరికాలో అదానీపై కేసు.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ డిమాండ్ అదానీ గ్రూప్
    Priyanka Gandhi : ప్రియాంక గాంధీ రాజకీయ పయనం.. నానమ్మ ఆశయాలతో పార్లమెంట్‌కి..! ప్రియాంక గాంధీ
    Sridhar Babu : సంక్షోభాన్ని దాటుకుంటూ ముందుకు.. అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025