NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal: ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు..? 
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal: ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు..? 
    ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు..?

    Arvind Kejriwal: ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు..? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2025
    04:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ పేర్కొన్నారు.

    యమునా నదిని భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ప్రభుత్వం విషపూరితం చేస్తున్నారని కేజ్రీవాల్ చేసిన అసంబద్ధమైన ఆరోపణల కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

    "కేజ్రీవాల్ మా ప్రభుత్వంపై చేసే అబద్ధ ఆరోపణల వల్ల హరియాణా, ఢిల్లీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆయన నిరాధార ఆరోపణలు చేస్తుంటే, మేము చూస్తూ ఊరుకోలేము. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు తప్పనిసరిగా అబద్ధమని మేము నిరూపిస్తాం" అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    హరియాణాలోని అధికార భాజపా ప్రభుత్వం యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థాలను ఉద్దేశపూర్వకంగా విడుదల చేస్తున్నారని కేజ్రీవాల్ సోమవారం ఆరోపించారు.

    వివరాలు 

    యమునా నదిలో అమ్మోనియం స్థాయి ఆరు రెట్లు అధికం

    ఈ విధంగా నదిలో విషాన్ని కలిపి ప్రజలను హతమార్చాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

    ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు.దిల్లీ ముఖ్యమంత్రి ఆతిషీ ఈ విషయంపై విలేకరులతో మాట్లాడుతూ, యమునా నదిని కలుషితం చేయడాన్ని 'జల ఉగ్రవాదం' అని పేర్కొన్నారు.

    హరియాణా నుండి దిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమ్మోనియం స్థాయి ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని వెల్లడించారు.

    అయితే, కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను దిల్లీ జల్ బోర్డ్ తిరస్కరించింది.ఈ ఆరోపణల్లో ఏ నిజం లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని దిల్లీ జల్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) హితవు పలికారు.

    ఈ విషయాన్ని ఎల్‌జీ దృష్టికి తీసుకువెళ్లాలని చీఫ్ సెక్రటరీని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా

    హర్యానా

    Manohar Lal Khattar: ఎమ్మెల్యే పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా మనోహర్ లాల్ ఖట్టర్
    Bittu Bajrangi: వ్యక్తిని కొడుతున్న బిట్టు బజరంగీ...చోద్యం చూస్తున్న పోలీసులు భారతదేశం
    Haryana Officer suspend: ఆప్ అభ్యర్థి పోల్ ప్యానెల్ డాక్యుమెంట్‌లో అనుచిత పదజాలం: హర్యానా అధికారి సస్పెండ్ గవర్నర్
    Haryana: హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా... 5గురు చిన్నారులు మృతి రోడ్డు ప్రమాదం

    అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేజ్రీవాల్ దిల్లీ
    Delhi CM : దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి..? దిల్లీ
    Delhi next CM : ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తర్వాత తదుపరి సీఎం ఎవరు?  దిల్లీ
    AAP: దిల్లీ ముందస్తు ఎన్నికలకు ఆప్‌ డిమాండ్‌.. ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం..! ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025