Page Loader
Arvind Kejriwal: ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు..? 
ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు..?

Arvind Kejriwal: ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ పేర్కొన్నారు. యమునా నదిని భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ప్రభుత్వం విషపూరితం చేస్తున్నారని కేజ్రీవాల్ చేసిన అసంబద్ధమైన ఆరోపణల కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. "కేజ్రీవాల్ మా ప్రభుత్వంపై చేసే అబద్ధ ఆరోపణల వల్ల హరియాణా, ఢిల్లీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆయన నిరాధార ఆరోపణలు చేస్తుంటే, మేము చూస్తూ ఊరుకోలేము. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు తప్పనిసరిగా అబద్ధమని మేము నిరూపిస్తాం" అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరియాణాలోని అధికార భాజపా ప్రభుత్వం యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థాలను ఉద్దేశపూర్వకంగా విడుదల చేస్తున్నారని కేజ్రీవాల్ సోమవారం ఆరోపించారు.

వివరాలు 

యమునా నదిలో అమ్మోనియం స్థాయి ఆరు రెట్లు అధికం

ఈ విధంగా నదిలో విషాన్ని కలిపి ప్రజలను హతమార్చాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు.దిల్లీ ముఖ్యమంత్రి ఆతిషీ ఈ విషయంపై విలేకరులతో మాట్లాడుతూ, యమునా నదిని కలుషితం చేయడాన్ని 'జల ఉగ్రవాదం' అని పేర్కొన్నారు. హరియాణా నుండి దిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమ్మోనియం స్థాయి ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. అయితే, కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను దిల్లీ జల్ బోర్డ్ తిరస్కరించింది.ఈ ఆరోపణల్లో ఏ నిజం లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని దిల్లీ జల్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) హితవు పలికారు. ఈ విషయాన్ని ఎల్‌జీ దృష్టికి తీసుకువెళ్లాలని చీఫ్ సెక్రటరీని కోరారు.