NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Krishna Dist: నిఘా వర్గాలు హెచ్చరికలు..కృష్ణా జిల్లా సముద్ర తీరంలో హై అలర్ట్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Krishna Dist: నిఘా వర్గాలు హెచ్చరికలు..కృష్ణా జిల్లా సముద్ర తీరంలో హై అలర్ట్ 
    నిఘా వర్గాలు హెచ్చరికలు..కృష్ణా జిల్లా సముద్ర తీరంలో హై అలర్ట్

    Krishna Dist: నిఘా వర్గాలు హెచ్చరికలు..కృష్ణా జిల్లా సముద్ర తీరంలో హై అలర్ట్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    11:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సింధూర్' నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలు, చొరబాట్ల ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

    ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

    సముద్రతీర మార్గాల్లోంచి ఉగ్రవాదులు చొరబాటు చేసే అవకాశం ఉండటంతో నేవీ, మెరైన్ పోలీస్ స్టేషన్లను అత్యున్నత హెచ్చరిక స్థాయిలో ఉంచారు.

    అంతేకాకుండా, తీర ప్రాంత గ్రామాల్లో నివసించే ప్రజలకు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

    'ఆపరేషన్ సింధూర్' అనంతరం కృష్ణా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం మొత్తం హై అలర్ట్‌ కింద కొనసాగుతోంది.

    వివరాలు 

    కృష్ణా జిల్లాలో సుమారు 110 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం

    భారత్,పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తోంది.

    ఉగ్రవాదులు సముద్ర మార్గాన్ని ఆశ్రయించి జిల్లాలోకి చొరబాటుకు ప్రయత్నించకుండా, తగిన బందోబస్తు చర్యలు చేపడుతున్నారు.

    కృష్ణా జిల్లాలో సుమారు 110 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం ద్వారా చొరబాట్లు జరగకుండా గస్తీలు కట్టుదిట్టం చేశారు.

    కృష్ణా జిల్లా పరిధిలో ప్రస్తుతం 3 మెరైన్ పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి.

    అవి వరుసగా - కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, మచిలీపట్నంలో గిలకలదిండి, కృత్తివెన్ను మండలంలోని ఒర్లగొందితిప్పలో ఉన్నాయి.

    ఈ మూడు స్టేషన్ల పరిధిలో మొత్తం 150 మంది సిబ్బంది పని చేస్తున్నారు.

    వివరాలు 

    మచిలీపట్నంకు కొత్త మెరైన్ బోట్లు 

    ప్రతి తీర గ్రామంలో మెరైన్ పోలీసులు నిఘా నిర్వహిస్తుండగా, వాటికి తోడుగా రెండు డ్రోన్ల సహాయంతో పహారా పెడుతున్నారు.

    ప్రజలతో కూడా సంబంధిత అధికారులు నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ అప్రమత్తం చేస్తూ ఉన్నారు.

    ఇక మచిలీపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న మెరైన్ బోట్లు పనిచేయకపోవడంతో, ఇతర ప్రాంతాల నుంచి కొత్త మెరైన్ బోట్లను అక్కడికి తరలిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    కృష్ణా జిల్లా

    తాజా

    Krishna Dist: నిఘా వర్గాలు హెచ్చరికలు..కృష్ణా జిల్లా సముద్ర తీరంలో హై అలర్ట్  ఆంధ్రప్రదేశ్
    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో 27విమానాశ్రయాలు మూసివేత.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్..  విమానం
    Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తికి బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ  ఐపీఎల్
    Chopper Crashes: ఉత్తరాఖండ్‌'లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌ కూలి ఐదుగురు మృతి ఉత్తరాఖండ్

    ఆంధ్రప్రదేశ్

    MEGA DSC: ఏపీ మెగా డీఎస్సీ 2025.. దరఖాస్తు చేసేముందు తెలుసుకోవాల్సిన విషయాలివే! భారతదేశం
    Raj Kasireddy: ఏపీ సిట్‌ పోలీసులు అదుపులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి భారతదేశం
    APPSC: పెండింగ్‌లో ఉన్న 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సిద్ధం భారతదేశం
    PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌ భారతదేశం

    కృష్ణా జిల్లా

    Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి  రోడ్డు ప్రమాదం
    Andhra Pradesh: గుడ్లవల్లేరులో దారుణం.. లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా!  భారతదేశం
    Vijayawada: భయం గుప్పిట్లో విజయవాడ.. మళ్లీ పెరిగిన వరద ప్రవాహం  విజయవాడ వెస్ట్
    Tsunami: అలల కాటుతో తెగిపోయిన జీవితాలు.. విధ్వంసానికి 20 ఏళ్లు పూర్తి మచిలీపట్నం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025