NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: అమరావతిని ఇప్పుడు చూసే వారికి షాక్.. రాజధాని పరిస్థితి ఎలా ఉందొ తెలుసా?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Amaravati: అమరావతిని ఇప్పుడు చూసే వారికి షాక్.. రాజధాని పరిస్థితి ఎలా ఉందొ తెలుసా?
    అమరావతిని ఇప్పుడు చూసే వారికి షాక్.. రాజధాని పరిస్థితి ఎలా ఉందొ తెలుసా?

    Amaravati: అమరావతిని ఇప్పుడు చూసే వారికి షాక్.. రాజధాని పరిస్థితి ఎలా ఉందొ తెలుసా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2025
    05:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒకప్పుడు శాంతంగా ఉన్న అమరావతి ప్రాంతం, ఇప్పుడు నిర్మాణ కార్యాచరణలతో జోరుగా మారిపోయింది.

    ఎనిమిది నెలల క్రితం ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు దృశ్యం పూర్తి భిన్నంగా ఉండేది.

    ముళ్లకంపలు, పెరిగిన చెట్లు, అసంపూర్తిగా కట్టిన భవనాలు, ఏపుగా పెరిగిన చెట్లతో దారులు కూడా కనపడని స్థితి.

    అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముళ్ల చెట్లు తొలగించబడి, ముఖ్యమైన సీడ్ యాక్సెస్ రోడ్డుకు కొత్త రూపం దక్కింది.

    భవన నిర్మాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వీరి కోసం నిర్మాణ సంస్థలు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేశాయి.

    వివరాలు 

    మౌలిక వసతుల కల్పనపై కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న రైతులు 

    ముఖ్యంగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేనో నెలలో అమరావతి నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది.

    మూడు సంవత్సరాల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామని మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు.

    కేవలం భవనాలు మాత్రమే కాక, మౌలిక వసతుల కల్పనపై కూడా రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.

    మరోసారి భూముల సమీకరణ ప్రతిపాదనపై స్థానికుల నుంచి అభ్యంతరాలు కూడా వచ్చాయి.

    వివరాలు 

    మే 2న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం 

    అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ మే 2న ప్రారంభించనున్నారని ప్రభుత్వం వెల్లడించింది.

    రూ.77,249 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. ఇందులో ఇప్పటికే రూ.43 వేల కోట్ల పనులకు టెండర్లు పూర్తయినట్టు మంత్రి నారాయణ తెలిపారు.

    పలు అధికారుల నివాసాల కోసం నిర్మించిన జీ+12 భవనాలు పూర్తయ్యాయి.

    అయితే కొన్ని ఫ్లాట్లలో ఫ్యాన్లు కూడా గల్లంతైనట్టు కనిపించింది. చాలా ఫ్లాట్లు చెత్తతో నిండిపోయి ఉండగా, ఇప్పుడు మిగిలిన పనులు, పెయింటింగ్ వర్క్ తిరిగి ప్రారంభమయ్యాయి.

    వివరాలు 

    గత పాలనలో నిర్మాణాలు - ఇప్పుడు పరిస్థితి 

    2015-2019 మధ్య కొంతమేర నిర్మాణాలు సాగాయి. ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ సముదాయానికి 2018 డిసెంబరులో, హైకోర్టు భవనానికి 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపనలు జరిగాయి.

    ప్రస్తుతం అవి కేవలం పునాదుల దశలోనే ఉన్నాయి. శిలాఫలకాలు పగిలిపోయాయి, నీరు నిలిచిన గుంతలు అక్కడ కనిపిస్తున్నాయి.

    రహదారులూ ఇంకా పూర్తికాలేదు. సీడ్ యాక్సెస్ రోడ్డు, 'ఇ' సిరీస్ రోడ్లు పూర్తికాలేకపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

    పలు రాష్ట్రాల నుండి కార్మికులు.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, యూపీ, బీహార్ నుండి వచ్చి ఈ నిర్మాణాల్లో పాల్గొంటున్నారు.

    వివరాలు 

    వరదల సమస్య - నివారణ చర్యలు 

    2024 సెప్టెంబరులో భారీ వర్షాల తర్వాత ఈ ప్రాంతంలో వరదలు వచ్చాయి.ఈనేపథ్యంలో వరద ముప్పు నివారణ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

    పాలవాగు, కొండవీటి వాగుల విస్తరణ పనులు సాగుతున్నాయి.పాలవాగు వెడల్పు 105మీటర్లకు, కొండవీటి వాగు 175మీటర్లకు విస్తరించనున్నారు. రూ.1500 కోట్ల వ్యయంతో ఆధునీకరణ జరుగుతోంది.

    భూములపై వివాదం

    2015లో అమరావతి రాజధానిగా ప్రకటించబడి, 53,748ఎకరాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో 34,794ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు.

    ఇప్పుడు మరోసారి 30,000-40,000ఎకరాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇది పరిశ్రమలు, స్పోర్ట్స్ సిటీ, హోటల్ ఇండస్ట్రీ,అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కోసం అవసరమని నారాయణ వెల్లడించారు.

    అయితే రైతులు ఇప్పటికే ఇచ్చిన భూములను ముందుగా అభివృద్ధి చేయాలని,తర్వాతే కొత్త భూముల సేకరణపై ఆలోచించాలంటున్నారు.

    వివరాలు 

    రైతుల అభ్యంతరాలు 

    తుళ్లూరు, మందడం ప్రాంత రైతులు మౌలిక వసతులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    ప్లాట్లకు రోడ్లు, కరెంటు, తాగునీరు, పార్కులు వంటి వసతులు కావాలంటున్నారు.

    కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు మొదలవ్వాలని కోరుతున్నారు.

    ప్రొఫెసర్ శ్రీకుమార్ మాటల్లో చెప్పాలంటే - భవిష్యత్తులో నిధుల కోసం భూముల అమ్మకాన్ని ఆధారంగా తీసుకోడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

    పునర్వినియోగ విద్యుత్ లక్ష్యం

    2050 నాటికి అమరావతిలో 2706 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా.

    ఇందులో 30 శాతం పునర్వినియోగ విద్యుత్ వనరుల నుంచే పొందాలని సీఆర్డీఏ ప్రకటించింది. సోలార్ ప్యానెల్స్ ద్వారా 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఉంది.

    వివరాలు 

    ఏకైక రాజధాని పై ప్రశ్నార్థకం 

    2019లో వైసీపీ ప్రభుత్వం మూడూ రాజధానుల అంశాన్ని తీసుకురాగా, అమరావతి అభివృద్ధి ఆగిపోయింది.

    అదే సమయంలో రైతులు 1600 రోజులకు పైగా నిరసనలు చేశారు. ఇప్పుడు మళ్లీ అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలన్న దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

    జంగిల్ క్లియరెన్స్ పనులకు రూ.36 కోట్లు వెచ్చించబడింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులో అమరావతి రాజధానిగా గుర్తింపు పొందింది. సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ పెండింగ్‌లో ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి

    తాజా

    Motivation : ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే! జీవితం
    Kiran Abbavaram: తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు కిరణ్ అబ్బవరం
    Bitcoin: దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌ క్రిప్టో కరెన్సీ
    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్

    అమరావతి

    CM Chandrababu: 'బ్రాండ్ ఏపీ' పేరుతో దావోస్‌కు సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    Amaravati: రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం భారతదేశం
    AP New Airport : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్.. ఆ ప్రాంత రూపురేఖలు మార్చే ప్రణాళిక! నారా లోకేశ్
    Ap Tourism :పర్యాటక రంగం అభివృద్ధిపై ఏపీ స్పెషల్ ఫోకస్.. రూ.500 కోట్లతో అమరావతిలో భారీ పర్యాటక ప్రాజెక్టు! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025