NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pakhal Lake : ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటనతో పాకాల భవిష్యత్ ఎలా మారనుంది?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pakhal Lake : ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటనతో పాకాల భవిష్యత్ ఎలా మారనుంది?
    ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటనతో పాకాల భవిష్యత్ ఎలా మారనుంది?

    Pakhal Lake : ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటనతో పాకాల భవిష్యత్ ఎలా మారనుంది?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 04, 2025
    03:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో వెండి రంగులో మెరిసే సరస్సు, విభిన్న జాతుల పక్షుల కిలకిలరావాలు ఇవన్నీ పాకాల ప్రత్యేకతలు.

    కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ సరస్సు ఇప్పటికీ వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ రైతులకు ప్రాణాధారంగా మారింది.

    అయితే కొందరి స్వార్థంతో ఈ ప్రాంత ప్రత్యేకత కనుమరుగవుతోంది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    Details

     ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటన 

    కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాకాల సరస్సు పరిసరాలను ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

    వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్న పాకాల అడవులను పరిరక్షించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.

    ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది.

    Details

    పర్యవేక్షణ కమిటీలో ఎవరుంటారంటే? 

    ఈ కమిటీలో తెలంగాణ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, పర్యావరణ శాఖ కార్యదర్శి, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు.

    పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు,

    యూనివర్సిటీ జీవావరణ శాస్త్ర అధ్యాపకులు, జిల్లా కలెక్టర్, జీవ వైవిధ్య బోర్డు సభ్యులు, అటవీశాఖ డీఎఫ్ఓ, పర్యావరణ శాఖ డైరెక్టర్‌లు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

    Details

     సెన్సిటివ్ జోన్‌లో చేపట్టే చర్యలు 

    అధికారుల పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తారు.

    క్వారీయింగ్‌లను పూర్తిగా నిలిపివేస్తారు.

    ఇసుక తవ్వకాలను పూర్తిగా నిషేధిస్తారు.

    అడవులను అభివృద్ధి చేసేందుకు ఎకో టూరిజం సర్క్యూట్‌ను రూపొందిస్తారు.

    కొత్త పరిశ్రమలు, డ్యామ్‌ల నిర్మాణాలకు అనుమతి ఉండదు.

    కొండలు, గుట్టల వద్ద రాళ్ల తవ్వకాలను పూర్తిగా నిషేధిస్తారు.

    పర్యాటక అభివృద్ధి

    పర్యాటకులను ఆకర్షించేందుకు రూ. 56 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

    ఇందులో భాగంగా: బట్టర్‌ఫ్లై గార్డెన్, బోటింగ్‌, నైట్ క్యాంపింగ్‌, ట్రెక్కింగ్‌, వన్యప్రాణుల వీక్షణ కోసం సఫారీ ఏర్పాటు చేయనున్నారు.

    Details

     పాకాల సరస్సు ఎక్కడుంది? 

    పాకాల సరస్సు హైదరాబాద్‌ నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉండగా, పాకాల సమీప పట్టణం నర్సంపేట.

    ఇది ఖానాపురం మండల పరిధిలో ఉంది. నర్సంపేట నుంచి పాకాల 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తగూడ వెళ్లే మార్గంలో ఈ అద్భుతమైన పాకాల అడవి విస్తరించి ఉంది.

    ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి హైదరాబాద్‌ నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ తాజా నిర్ణయం పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడనుంది.

    అక్రమ తవ్వకాలను అరికట్టడం, అడవిని రక్షించడం, పర్యాటక అభివృద్ధి ద్వారా పాకాల తన ప్రత్యేకతను సజీవంగా ఉంచుకోనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలంగాణ

    Bamboo Cultivation: తెలంగాణలో 2 లక్షల ఎకరాల్లో వెదురు సాగు లక్ష్యంగా ప్రణాళికలు ప్రభుత్వం
    Grants: తెలంగాణకు కేంద్రం నుంచి నిధుల జాప్యం.. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం
    Telangana Beers: తెలంగాణ మందు బాబులకు ఊరట.. బీర్ల సరఫరాపై యూబీ కీలక ప్రకటన భారతదేశం
    Telangana: 'గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024' అవార్డు ప్రకటించిన తెలంగాణ గవర్నర్‌ కార్యాలయం భారతదేశం

    కేంద్ర ప్రభుత్వం

    PSU banks: ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి కేంద్రం పునరాలోచన బ్యాంక్
    Ration Cards: 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల తొలగింపు: ప్రభుత్వం భారతదేశం
    PAN 2.0: పాన్ 2.0.. పాత కార్డులు కొనసాగుతాయా? ఐటీ శాఖ క్లారిటీ! ఇండియా
    Kazipet Railway Coach: తెలంగాణకు మరో విభజన హామీని నెరవేర్చిన కేంద్రం.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025