NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cyber ​​criminals: సుప్రీంకోర్టు పేరుతో భారీ మోసం.. రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటి 50 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు! 
    తదుపరి వార్తా కథనం
    Cyber ​​criminals: సుప్రీంకోర్టు పేరుతో భారీ మోసం.. రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటి 50 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు! 
    సుప్రీంకోర్టు పేరుతో భారీ మోసం.. రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటి 50 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు!

    Cyber ​​criminals: సుప్రీంకోర్టు పేరుతో భారీ మోసం.. రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటి 50 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 10, 2025
    03:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సైబర్ నేరగాళ్లు ఇప్పుడు తమ మోసాలకు కొత్త రూపం ఇచ్చారు. గతంలో సీబీఐ, సీఐడీ, దిల్లీ పోలీసుల పేరుతో భయపెట్టి మోసం చేసిన వాళ్లు, ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టును వాడుకుంటున్నారు.

    తాజాగా హైదరాబాదులో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సుప్రీంకోర్టు జడ్జి అని నమ్మించి వీడియో కాల్ ద్వారా భారీ స్కాం చేశారు.

    హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వారు, "మీ పేరుతో కేసు నమోదైంది. విచారణ సుప్రీంకోర్టులో జరుగుతోందంటూ భయపెట్టారు.

    ఆపై వీడియో కాల్‌కు కనెక్ట్ కావాలని చెప్పారు.కొన్ని నిమిషాల్లోనే వీడియోలో ఒకరు కనిపించి తాను సుప్రీంకోర్టు జడ్జినని చెప్పారు. ఈ కేసుపై తక్షణమే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

    Details

    విచారణ తర్వాత డబ్బులు తిరిగొస్తాం

    ఆ తరవాత మరో మలుపు. కేసు నివారణకు, ముందుగా కోర్ట్ అకౌంట్‌లో డబ్బులు జమ చేయాలని, విచారణ తర్వాత డబ్బులు తిరిగి వస్తాయని నమ్మించారు.

    ఈ మాటలు నమ్మిన బాధితుడు కోటి 50 లక్షల రూపాయలు తెలిపిన బ్యాంక్ అకౌంట్‌లో జమ చేశాడు. అయితే డబ్బులు పోగానే వీడియో కాల్ కట్ అయింది.

    ఆ తర్వాత నుంచి వారికి ఫోన్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

    తర్వాత బాధితుడు మోసపోయానని గ్రహించి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.సుప్రీంకోర్టు పేరుతో నకిలీ కోర్టు, నకిలీ జడ్జిని సృష్టించి భారీగా మోసంచేసిన ఈ ఘటన సైబర్ మోసాలకు కొత్త ఉదాహరణగా నిలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Cyber ​​criminals: సుప్రీంకోర్టు పేరుతో భారీ మోసం.. రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటి 50 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు!  సుప్రీంకోర్టు
    Godavari Pushkaralu 2027: త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి  ఆంధ్రప్రదేశ్
    Foreign trips: భారతీయ పర్యాటకులకు శుభవార్త.. తక్కువ బడ్జెట్‌తో విదేశీ యాత్రలివే! థాయిలాండ్
    Nothing Phone 3 : అద్భుత ఫీచర్లతో నథింగ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే? స్మార్ట్ ఫోన్

    సుప్రీంకోర్టు

    Demolitions: ఇళ్ల కూల్చివేతల చర్యలతో అంతా కలవరపడ్డారు: యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం  భారతదేశం
    MLAs Defection Case: పార్టీ ఫిరాయింపులపై నేడు కీలక విచారణ.. ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ! బీఆర్ఎస్
    Supreme Court: సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. కోర్టు కీలక వ్యాఖ్యలు భారతదేశం
    Teachers recruitment Scam: దీదీ సర్కారుకు సుప్రీం షాక్‌.. ఆ 25వేల ఉపాధ్యాయుల నియామకాలు రద్దు  మమతా బెనర్జీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025