NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Yasin Malik:"నేను ఉగ్రవాది కాదు..  రాజకీయ నాయకుడిని": సుప్రీంకోర్టుకు యాసిన్ మాలిక్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Yasin Malik:"నేను ఉగ్రవాది కాదు..  రాజకీయ నాయకుడిని": సుప్రీంకోర్టుకు యాసిన్ మాలిక్
    నేను ఉగ్రవాది కాదు.. రాజకీయ నాయకుడిని": సుప్రీంకోర్టుకు యాసిన్ మాలిక్

    Yasin Malik:"నేను ఉగ్రవాది కాదు..  రాజకీయ నాయకుడిని": సుప్రీంకోర్టుకు యాసిన్ మాలిక్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 04, 2025
    05:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తాను రాజకీయ నాయకుడని, ఉగ్రవాదిని కాదని వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌ (Yasin Malik)స్పష్టం చేశాడు.

    గతంలో తనతో ఏడుగురు భారతప్రధానులు చర్చలు జరిపిన విషయాన్ని వెల్లడించాడు.

    ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడనే ఆరోపణలపై ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మాలిక్, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యాడు.

    ఈ సందర్భంగా సీబీఐ చేసిన ఉగ్రవాద ఆరోపణలను అతను ఖండించాడు.

    జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-యాసిన్ (JKLF-Y)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చలేదని పేర్కొన్నాడు.

    1994లో తనపై నమోదైన 32 కేసుల్లో బెయిల్‌ లభించిందని,ఆ కేసులను కొనసాగించలేదని గుర్తుచేశాడు.

    పీవీ నరసింహారావు,హెచ్‌డీ దేవెగౌడ,ఐకే గుజ్రాల్,అటల్ బిహారీ వాజ్‌పేయి,మన్మోహన్ సింగ్ హయాంలో తన సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పాడు.

    వివరాలు 

    కేసులను జమ్మూ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు..

    ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన మొదటి ఐదేళ్లలో కూడా ఇదే విధానాన్ని కొనసాగించారని, అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం 35 ఏళ్ల నాటి ఉగ్రవాద కేసులను తిరిగి విచారణకు తెచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశాడు.

    1989లో జమ్మూలో అతనిపై నమోదైన రెండు కేసుల్లో విచారణ నిమిత్తం మాలిక్‌ను కోర్టులో హాజరుపరచాలని చేసిన ప్రతిపాదనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ సుప్రీం కోర్టును కోరింది.

    ఈ కేసులను జమ్మూ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది.

    మాలిక్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నందున అతడు అక్కడికి వెళితే తీవ్రవాద దాడులు జరగవచ్చని సీబీఐ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు.

    వివరాలు 

    వాయుసేన సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు

    ఈ నేపథ్యంలో మాలిక్ మాట్లాడుతూ, తానేమీ ఉగ్రవాదిని కాదని స్పష్టం చేశాడు.

    1990 జనవరి 25న పాత శ్రీనగర్ ఎయిర్‌ఫీల్డ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న వాయుసేన సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

    ఈ ఘటనకు మాలిక్‌ నేతృత్వం వహించాడనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అరెస్టయిన అతడిపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

    1994లో జైలు నుంచి విడుదలైన మాలిక్‌ తరువాత ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడనే ఆరోపణలు రుజువు కావడంతో జీవితఖైదు విధించబడింది. ప్రస్తుతం తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Encounter: ఛత్తీస్‌గఢ్‌లో తుపాకుల మోత.. ఎన్‌కౌంటర్‌లో 28 మావోయిస్టుల మృతి ఛత్తీస్‌గఢ్
    Jyoti Malhotra: 'పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులను కలిశాను, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించాను'.. జ్యోతి మల్హోత్రా అంగీకారం..! జ్యోతి మల్హోత్రా
    Telangana: ప్రజాపాలనలో రేషన్ కార్డు అప్లై చేసారా? స్టేటస్ చెక్ చేసుకునే మార్గం ఇదే! తెలంగాణ
    Google I/O 2025: గూగుల్ మీట్‌లో రియల్‌ టైమ్‌ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌.. అసలేంటీ ఫీచర్‌? ఎలా ఉపయోగపడనుందంటే? గూగుల్

    సుప్రీంకోర్టు

    Kolkata Murder Case: నా కొడుకు తప్పు చేశాడు.. అతడికి జీవించే హక్కు లేదు : ఆర్జీకర్ కేసు దోషి తల్లి కోల్‌కతా
    Rahul Gandhi: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. రాహుల్ గాంధీ
    Supreme Court: నేడు సుప్రీంకోర్టులో సంజయ్‌ రాయ్‌ జీవితఖైదుపై విచారణ  భారతదేశం
    supreme court:పెళ్లికి పెద్దలు నిరాకరించడం ఆత్మహత్యను ప్రేరేపించడం కాదు: సుప్రీంకోర్టు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025