
Heavy Rain Alert: రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ!
ఈ వార్తాకథనం ఏంటి
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని అధికారులు హెచ్చరించారు. అల్పపీడనం బికనేర్ ప్రాంతం నుంచి విస్తరించి రుతుపవన ద్రోణి రూపంలో విస్తరించి ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల కారణంగా శ్రీకాకుళం,మన్యం,అల్లూరి జిల్లాల్లో మధ్యస్థం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా ప్రాంతంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, అయితే దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.
వివరాలు
గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
ఈదురు గాలులు గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జగన్నాధ కుమార్, విశాఖ తుఫాను కేంద్రాలు కూడా ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశాయి. ఇంకా,తెలంగాణ రాష్ట్రంలోనూ రాబోయే సమయాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్,జయశంకర్ భూపాలపల్లి,జగిత్యాల,కరీంనగర్,కొబరం భీం,ఆసిఫాబాద్,మంచిర్యాల, ములుగు,నిర్మల్,నిజామాబాద్,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వచ్చే 2-3 గంటల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు భద్రంగా ఉండాలని, తమ పంటను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. వర్షం సమయంలో చెట్ల కింద నిలబడకూడదని,కరెంట్ స్తంభాల సమీపంలో ఉండకూడదని వాతావరణ కేంద్రం అధికారులు ప్రత్యేకంగా హెచ్చరించారు.