
J-K Encounter: జమ్ముకశ్మీర్ పూంచ్లో ఎన్కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లో పూంచ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
భారత సైన్యం, రాష్ట్రీయ రైఫిల్స్, స్థానిక పోలీసులు జరిగిన సంయుక్త ఆపరేషన్లో ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ పేర్కొంది.
పూంచ్లోని సింధారా ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
ఉగ్రవాదులు సోమవారం రాత్రి 11.30 గంటలకు భారత సైన్యానికి తారసపడ్డారు.
ఈ క్రమంలో రాష్ట్రీయ రైఫిల్స్, స్థానిక పోలీసులను అప్రమత్తం చేసిన సైన్యం రాత్రి పూట ఉగ్రవాదుల కదలికలను పసిగట్టేందుకు డ్రోన్లను మోహరించింది.
ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తెల్లవారుజామున భారత సైన్యం- ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఆపరేషన్లో హతమైన వారు విదేశీ ఉగ్రవాదులేనని, వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్
Four terrorists have been killed by the security forces in a joint operation in the Sindhara area of Poonch. The first engagement between security forces took place at around 11:30 pm yesterday after which drones were deployed along with other night surveillance equipment.
— JAMMU LINKS NEWS (@JAMMULINKS) July 18, 2023
At… pic.twitter.com/ryKGZ70rQR