No confidence Motion:లోక్ సభలో వీగిన అవిశ్వాస తీర్మానం
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 10, 2023
08:09 pm
ఈ వార్తాకథనం ఏంటి
లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. గురువారం మూజువాణీ ఓటింగ్ నిర్వహించిన స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు వాడీవేడిగా చర్చ జరిగింది. అవిశ్వాసంపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సహా విపక్షాలను ఎండగట్టారు. ప్రధాని మాట్లాడుతున్న సమయంలో ఇండియా కూటమి ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి