NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cybercrime Police: ఏపీలో సైబర్ నేరాల పెరుగుదల.. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
    తదుపరి వార్తా కథనం
    Cybercrime Police: ఏపీలో సైబర్ నేరాల పెరుగుదల.. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
    ఏపీలో సైబర్ నేరాల పెరుగుదల.. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు

    Cybercrime Police: ఏపీలో సైబర్ నేరాల పెరుగుదల.. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 01, 2024
    09:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సైబర్‌ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో మరో ముందడుగు వేసింది. సైబర్‌ నేరాల పెరుగుదల క్రమంలో ప్రతి జిల్లాలోనూ సైబర్‌ పోలీసుస్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

    ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం నగర కమిషనరేట్లు, అమరావతిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో మాత్రమే ఈ పోలీసుస్టేషన్లు ఉన్నాయి.

    అయితే సైబర్‌ నేరాలను పెరుగుతుండటంతో 24 జిల్లాల్లో అదనపు సైబర్‌ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ముందుకొచ్చింది.

    ఈ పోలీస్ స్టేషన్లకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇన్‌స్పెక్టర్లను ఎస్‌హెచ్‌వోలుగా నియమించనున్నారు.

    Details

    సైబర నేరాల్లో అధిక శాతం ఆర్థిక మోసాలే

    సైబర్‌ నేరాల కేసులను విచారించేందుకు, ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చనున్నారు.

    ఫిర్యాదుదారులకు సహకరించడం, నేరాలను వివరంగా విచారణ చేయడం ఈ స్టేషన్ల ముఖ్య బాధ్యతగా ఉండనుంది.

    సైబర్‌ నేరాల్లో అధిక శాతం ఆర్థిక మోసాలే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

    సైబర్‌ మోసాల ద్వారా నేరగాళ్లు ఏటా దాదాపు రూ.313 కోట్లు దోచేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా నకిలీ కాల్స్ ద్వారా బ్యాంకు వివరాలు తీసుకోవడం, క్రిప్టో కరెన్సీ, నకిలీ యాప్‌లు, మేట్రిమోని మోసాలు కూడా ఉండడం గమనార్హం.

    Details

    ఉద్యోగాల అవకాశాల పేరుతో అధిక మోసాలు

    అంతేకాకుండా, ఫేక్ వెబ్‌సైట్లు, ఉద్యోగ అవకాశాలు పేరుతో జరిగిన మోసాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

    గత ఐదేళ్లలో రాష్ట్రంలో 10,125 సైబర్‌ నేరాలు నమోదయ్యాయి. అయితే వీటిలో 2% మాత్రమే కేసులను చేధించారు.

    నేరగాళ్లు వేరే దేశాల్లో, ప్రాంతాల్లో ఉంటుండటంతో వారి పట్టుబడటం, మోసపోయిన సొమ్మును తిరిగి రాబట్టడం కష్టతరంగా మారుతోంది.

    ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్‌ పోలీసుస్టేషన్ల ఏర్పాటు ద్వారా, ఈ నేరాలను సమర్థంగా ఎదుర్కోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    పోలీస్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఆంధ్రప్రదేశ్

    New Medical Colleges: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్  ఇండియా
    Baline Srinivasalu: వైసీపీని వీడనున్న బాలినేని.. త్వరలో జనసేనలో  చేరిక! జనసేన
    Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం  భారతదేశం
    World record: మండల ఆర్ట్‌తో వేంకటేశ్వరుడి చిత్రం.. ఒకేసారి 54 ప్రపంచ రికార్డులు  హైదరాబాద్

    పోలీస్

    కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్  మధ్యప్రదేశ్
    Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్  తెలంగాణ
    ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ మృతి.. హత్య.. ఆత్మహత్యా..! దిల్లీ
    Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025