NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tirupati: తిరుపతిలో వర్షపాతం పెరుగుదల.. భవిష్యత్‌లో భారీ వర్షాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Tirupati: తిరుపతిలో వర్షపాతం పెరుగుదల.. భవిష్యత్‌లో భారీ వర్షాలు
    తిరుపతిలో వర్షపాతం పెరుగుదల.. భవిష్యత్‌లో భారీ వర్షాలు

    Tirupati: తిరుపతిలో వర్షపాతం పెరుగుదల.. భవిష్యత్‌లో భారీ వర్షాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 13, 2025
    01:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ శతాబ్దం చివరికి తిరుపతి జిల్లాలో వర్షపాతం పెరుగడంతో పాటు, భారీ వర్షాల రోజుల సంఖ్య గణనీయంగా అధికమవుతుందని ఐపీసీసీ (ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌) మోడళ్ల ఆధారంగా నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది.

    నైరుతి రుతుపవనాల సమయంలో భారీ వర్షాల రోజులు 30-40 వరకు పెరుగుతాయని, వార్షిక వర్షపాతం 8-32% మధ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

    దిల్లీకి చెందిన 'ది ఎనర్జీ అండ్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌' పరిశోధకుడు వెంకట్‌రమణ కాగిత, స్వీడన్‌లోని ఉప్పసల విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లతో కలిసి తిరుపతి జిల్లాలో వాతావరణ మార్పులపై అధ్యయనం చేపట్టారు.

    1981-2010 మధ్య భారత వాతావరణశాఖ విడుదల చేసిన వర్షపాతం సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ అధ్యయనం నిర్వహించారు.

    Details

    అధ్యయనంలో వెల్లడైన ముఖ్యాంశాలు 

    2026 నుంచి 2100 వరకు కాలాన్ని మూడు విభాగాలుగా విభజించి పరిశీలించగా, మూడు దశలలోనూ వర్షపాతం పెరుగుతుందని తేలింది.

    1981-2010 కాలంతో పోలిస్తే, 2100 నాటికి గ్రీన్‌హౌస్‌ వాయువుల అధిక ఉద్గారాల వల్ల వర్షపాతం 32% పెరుగుతుందని, మితంగా విడుదలైతే 19% పెరుగుతుందని అంచనా వేశారు.

    జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య వర్షపాతం 21-35% వరకు పెరగనుంది. భవిష్యత్తులో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సంవత్సరానికి 3.3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

    వేసవిలో ఈ పెరుగుదల 3.6 డిగ్రీల వరకు ఉండొచ్చు. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరం దాటే తుపాన్లు తిరుపతిపై ప్రభావం చూపే అవకాశముంది.

    తిరుపతిలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 65% ఈశాన్య రుతుపవనాల కాలంలోనే కురుస్తోంది.

    Details

    సరైన ప్రణాళిక అవసరం

    పీలేరు సమీపంలోని తిరుపతి భక్తుల రద్దీతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2031 నాటికి నగర జనాభా 10 లక్షలకు చేరుకొనే అవకాశం ఉంది.

    ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా విస్తరిస్తున్నాయి.

    వాతావరణ మార్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, నగరాన్ని ప్రకృతి వైపరీత్యాల ప్రభావం నుంచి రక్షించే సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వెంకట్‌రమణ కాగిత సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుపతి
    భారీ వర్షాలు

    తాజా

    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా

    తిరుపతి

    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి తిరుమల తిరుపతి
    17వ తేదీ నుంచి 16కోచ్‌లతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ పరుగులు; టైమింగ్స్ కూడా మార్పు  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం అగ్నిప్రమాదం
    జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజు.. తీవ్ర ఆగ్రహంలో పార్టీ శ్రేణులు  ఆంధ్రప్రదేశ్

    భారీ వర్షాలు

    Trains Cancelled: భారీ వర్షాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో నేడు రద్దయిన రైళ్ల వివరాలివే.. భారతదేశం
    Prakasm Barrage: ఏపీని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీపై రెండో ప్రమాద హెచ్చరిక జారీ ఆంధ్రప్రదేశ్
    Telangana Rains: తెలంగాణలో ఇవాళ 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. విద్యా సంస్థలకు సెలవు తెలంగాణ
    Telangana: ఎడతెరపి లేని వర్షాలు.. 15 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025