English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / S Jaishankar: సరైన పత్రాలు లేకుండా అగ్రరాజ్యానికి వచ్చిన భారతీయులను తిరిగి రప్పిస్తాం: జైశంకర్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    S Jaishankar: సరైన పత్రాలు లేకుండా అగ్రరాజ్యానికి వచ్చిన భారతీయులను తిరిగి రప్పిస్తాం: జైశంకర్
    సరైన పత్రాలు లేకుండా అగ్రరాజ్యానికి వచ్చిన భారతీయులను తిరిగి రప్పిస్తాం: జైశంకర్

    S Jaishankar: సరైన పత్రాలు లేకుండా అగ్రరాజ్యానికి వచ్చిన భారతీయులను తిరిగి రప్పిస్తాం: జైశంకర్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2025
    08:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ (S Jaishankar) న్యాయబద్ధమైన వలసలను భారత ప్రభుత్వం పూర్తిగా సమర్థిస్తుందని స్పష్టం చేశారు.

    సరైన పత్రాలు లేకుండా విదేశాలకు వెళ్ళిన భారతీయులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.

    నూతన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రమాణస్వీకార వేడుకలో పాల్గొనడానికి అమెరికా (USA) వెళ్లిన జైశంకర్‌ కొంతమంది భారతీయ విలేకరులతో మాట్లాడారు.

    ఈ సందర్భంగా, ఇరు దేశాల సంబంధాలు, భారత విదేశాంగ విధానం వంటి వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

    వివరాలు 

    చట్టవిరుద్ధ చర్యల వల్ల ఇతర నేరాలకు అవకాశాలు

    ''భారతీయుల ప్రతిభ, నైపుణ్యాలకు గ్లోబల్‌ స్థాయిలో మరింత అవకాశాలు దక్కాలని మేం ఆశిస్తున్నాం. అందుకే న్యాయబద్ధమైన వలసలకు మేం పూర్తి మద్దతు ఇస్తున్నాం. అయితే, అక్రమ రవాణా లేదా న్యాయవిరుద్ధ వలసలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే చట్టవిరుద్ధ చర్యల వల్ల ఇతర నేరాలకు అవకాశాలు పెరుగుతాయి. అలాంటి పరిస్థితులు ఏ దేశానికైనా మంచివి కావు. చట్టవిరుద్ధ చర్యలు దేశానికి మంచి పేరు తీసుకురావు. అందుకే అమెరికా సహా ఏ దేశంలోనైనా అక్రమంగా ఉన్న భారతీయులను తిరిగి స్వదేశానికి చట్టబద్ధంగా రప్పించేందుకు మేం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం,'' అని జైశంకర్‌ తెలిపారు.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    ఆ భారతీయుల వివరాలను కేంద్రం పరిశీలిస్తోంది 

    అక్రమంగా అమెరికాలో ఉన్న భారతీయులను వెనక్కి పంపించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న వార్తలపై అడిగిన ప్రశ్నకు జైశంకర్‌ స్పందించారు.

    అమెరికా పంపించాలని భావిస్తున్న భారతీయుల వివరాలను కేంద్రం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు.

    కానీ, ప్రస్తుతం ఎంతమంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేమని వివరించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుబ్రమణ్యం జైశంకర్

    తాజా

    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా
    Weather Update: తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు తెలంగాణ

    సుబ్రమణ్యం జైశంకర్

    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ పాకిస్థాన్
    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్ కాంగ్రెస్
    మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్ ప్రధాన మంత్రి
    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025