Republic Day: మహిళా శక్తిని చాటనున్న రిపబ్లిక్ డే..ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఈ వార్తాకథనం ఏంటి
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం దేశమంతా ఘనంగా జరగనున్నాయి.
దేశ రాజధాని దిల్లీ కర్తవ్య మార్గంలో కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి లేదా మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, భారతదేశ సైనిక పరాక్రమం,సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే గ్రాండ్ పరేడ్ను నిర్వహించనుంది.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, భారత అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముతో కలిసి ఉత్సవాలకు నాయకత్వం వహిస్తారు.
తొలిసారిగా, మొత్తం మహిళలతో కూడిన ట్రై-సర్వీస్ బృందం కవాతులో పాల్గొంటుంది. భారత వైమానిక దళం ఫ్లై-పాస్ట్లో 15 మంది మహిళా పైలట్లు భాగం కానున్నారు.
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) కంటెంజెంట్లు కూడా మహిళా సిబ్బందిని మాత్రమే కలిగి ఉంటాయి.
Details
ఈసారి పరేడ్లో 90 మంది సభ్యుల ఫ్రాన్స్ దళం
కవాతులో 100 మంది మహిళా కళాకారులు సంప్రదాయ సైనిక బ్యాండ్లకు బదులుగా సంఖ్, నాదస్వరం, నగదా వంటి భారతీయ సంగీత వాయిద్యాలను మొదటిసారి వినియోగించనున్నారు.
భారతదేశ సాయుధ దళాలు క్షిపణులు, డ్రోన్ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనానికి అమర్చిన మోర్టార్లు, BMP-II పదాతిదళ పోరాట వాహనాలతో సహా స్వదేశీ సైనిక హార్డ్వేర్లను ప్రదర్శిస్తాయి.
జాతీయ వార్ మెమోరియల్కు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించడంతో వేడుకలు ప్రారంభమవుతాయి.
ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే పరేడ్లో రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో కలిసి గౌరవ వందనం స్వీకరిస్తారు.
భారతదేశం,ఫ్రాన్స్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబిస్తూ ఈసారి పరేడ్లో 90 మంది సభ్యుల ఫ్రాన్స్ దళం కూడా పాల్గొంటోంది.
Details
70,000 మందితో దిల్లీలో భద్రతా ఏర్పాట్లు
260 మంది సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ మహిళా సైనికులు 'నారీ శక్తి' పేరుతో విన్యాసాలను ప్రదర్శిస్తారు.
వివిధ రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల నుండి పదహారు శకటాలు , తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల నుండి, భారతదేశం గొప్ప సాంస్కృతిక వస్త్రాలను వర్ణిస్తూ, కర్తవ్య పథంలోకి వస్తాయి.ఈ శకటాలు "మహిళా సాధికారత" థీమ్ను కూడా హైలైట్ చేస్తాయి.ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శకటాలున్నాయి.
రిపబ్లిక్ డే వేడుకల కోసం 70,000 మందితో దిల్లీలో భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఇందులో 14,000 మందిని కర్తవ్యపథ్లో మోహరించారు.
కమాండో విన్యాసాలు,విధ్వంసక తనిఖీలతో సహా కఠినమైన భద్రతా ప్రోటోకాల్లతో కర్తవ్య మార్గంలో కవాతును 77,000 మంది ప్రేక్షకులు వీక్షిస్తారని అంచనా వేయబడింది.
Details
40ఏళ్ల తర్వాత బగ్గీ వినియోగం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకుంటారు. దాదాపు 40ఏళ్ల తర్వాత ఈ బగ్గీని వినియోగిస్తున్నారు.
గురువారం సాయంత్రం 6 గంటల నుండి విజయ్ చౌక్ నుండి ఇండియా గేట్ వరకు కర్తవ్య మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కవాతు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.