NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-Pakistan: 'భారతదేశాన్ని అధిగమించి,మీ స్వంత వైఫల్యాలను సరిదిద్దుకోండి'.. పాకిస్థాన్‌ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్‌.. 
    తదుపరి వార్తా కథనం
    India-Pakistan: 'భారతదేశాన్ని అధిగమించి,మీ స్వంత వైఫల్యాలను సరిదిద్దుకోండి'.. పాకిస్థాన్‌ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్‌.. 
    పాకిస్థాన్‌ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్‌..

    India-Pakistan: 'భారతదేశాన్ని అధిగమించి,మీ స్వంత వైఫల్యాలను సరిదిద్దుకోండి'.. పాకిస్థాన్‌ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్‌.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 27, 2025
    08:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ భారత్‌పై నిరంతరం ఆరోపణలు చేస్తూనే ఉంది.

    ఇటీవల, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం హరించబడుతోందని, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పాకిస్తాన్‌ పేర్కొంది.

    అయితే, భారత్‌ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా, మాకు పాఠాలు చెప్పే స్థాయిలో ఆ దేశానికి లేదని స్పష్టంగా తెలిపింది.

    వివరాలు 

    స్పందించిన భారత రాయబారి క్షితిజ్‌ త్యాగి

    జెనీవాలో జరిగిన సమావేశంలో,పాక్‌ న్యాయ, మానవ హక్కుల మంత్రి అజం నజీర్‌ తరార్‌ జమ్మూకశ్మీర్‌పై వ్యాఖ్యలు చేశారు.

    దీనికి భారత రాయబారి క్షితిజ్‌ త్యాగి సముచితంగా స్పందించారు.

    'జమ్మూకశ్మీర్‌,లద్ధాఖ్‌ భారతదేశానికి అవిభాజ్య భాగాలు. పాకిస్తాన్‌ ఉగ్రవాదం కారణంగా బాధపడ్డ ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.మైనారిటీల హక్కులను హరించే,ప్రజాస్వామ్య విలువలను గౌరవించని పాకిస్తాన్‌ భారత్‌కు పాఠాలు చెప్పే అర్హత లేదు.వారి మాటల్లోనే కపటత్వం కనిపిస్తోంది.ఐరాస గుర్తించిన అనేక ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్‌ ఆశ్రయం కల్పిస్తోంది.భారత్‌ ప్రజాస్వామ్య పురోగతిపై దృష్టి సారిస్తూ, ప్రజలకు గౌరవాన్ని కల్పించేందుకు కృషి చేస్తోంది. అనవసర ఆరోపణలు చేయడం మానేసి, తమ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంపై దృష్టి పెట్టాలి' అని త్యాగి స్పష్టంగా పేర్కొన్నారు.

    వివరాలు 

    ఉగ్రవాద వ్యతిరేక పోరాటం గురించి మాట్లాడటం హాస్యాస్పదం

    అలాగే, ఇటీవల చైనా అధ్యక్షతన జరిగిన భద్రతామండలి సమావేశంలోనూ, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి మహమ్మద్‌ ఇషాక్‌ దార్‌ జమ్మూకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు.

    దీనిపై భారత్‌ కఠినంగా స్పందించింది. 'జైషే మహమ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే పాకిస్తాన్‌, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం గురించి మాట్లాడటం హాస్యాస్పదం' అని భారత్‌ ధీటుగా సమాధానమిచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    పాకిస్థాన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    భారతదేశం

    Hydrogen Train : భారత్‌లో తొలి హైడ్రోజన్‌ రైలు.. ట్రయల్‌ రన్‌ ప్రారంభం  రైల్వే బోర్డు
    PF Pension: 60 ఏళ్ల వయసులో పెన్షన్ లెక్కింపు.. ఎంత డబ్బు వస్తుందో తెలుసా? ప్రపంచం
    #Newsbytesexplainer: పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య నిర్మించిన డైరెక్ట్ సముద్ర మార్గం భారత్‌కు ఆందోళన కలిగిస్తుందా? బంగ్లాదేశ్
    NGT: చెట్ల తగ్గుదలపై నివేదికలు ఇవ్వండి.. రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన ఎన్జీటీ భారతదేశం

    పాకిస్థాన్

    Masood Azhar :2001 పార్లమెంట్ దాడి సూత్రధారి.. మసూద్ అజార్ కి గుండెపోటు..!  అంతర్జాతీయం
    Pakistan: పాక్ వైమానిక దాడుల అనంతరం తాలిబన్ల ప్రతీకారం.. సరిహద్దు వైపున భారీ మార్చ్ ఆఫ్ఘనిస్తాన్
    Abdul Rehman Makki: 26/11 ముంబై దాడుల ప్రధాన కుట్రదారు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి  అంతర్జాతీయం
    Taliban: 'ఖైబర్ ఫఖ్తుంఖ్వా మా భూభాగమే'.. తాలిబన్ రక్షణ శాఖ సంచలన ప్రకటన తాలిబాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025