Page Loader
India-Pakistan: 'భారతదేశాన్ని అధిగమించి,మీ స్వంత వైఫల్యాలను సరిదిద్దుకోండి'.. పాకిస్థాన్‌ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్‌.. 
పాకిస్థాన్‌ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్‌..

India-Pakistan: 'భారతదేశాన్ని అధిగమించి,మీ స్వంత వైఫల్యాలను సరిదిద్దుకోండి'.. పాకిస్థాన్‌ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ భారత్‌పై నిరంతరం ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇటీవల, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం హరించబడుతోందని, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పాకిస్తాన్‌ పేర్కొంది. అయితే, భారత్‌ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా, మాకు పాఠాలు చెప్పే స్థాయిలో ఆ దేశానికి లేదని స్పష్టంగా తెలిపింది.

వివరాలు 

స్పందించిన భారత రాయబారి క్షితిజ్‌ త్యాగి

జెనీవాలో జరిగిన సమావేశంలో,పాక్‌ న్యాయ, మానవ హక్కుల మంత్రి అజం నజీర్‌ తరార్‌ జమ్మూకశ్మీర్‌పై వ్యాఖ్యలు చేశారు. దీనికి భారత రాయబారి క్షితిజ్‌ త్యాగి సముచితంగా స్పందించారు. 'జమ్మూకశ్మీర్‌,లద్ధాఖ్‌ భారతదేశానికి అవిభాజ్య భాగాలు. పాకిస్తాన్‌ ఉగ్రవాదం కారణంగా బాధపడ్డ ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.మైనారిటీల హక్కులను హరించే,ప్రజాస్వామ్య విలువలను గౌరవించని పాకిస్తాన్‌ భారత్‌కు పాఠాలు చెప్పే అర్హత లేదు.వారి మాటల్లోనే కపటత్వం కనిపిస్తోంది.ఐరాస గుర్తించిన అనేక ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్‌ ఆశ్రయం కల్పిస్తోంది.భారత్‌ ప్రజాస్వామ్య పురోగతిపై దృష్టి సారిస్తూ, ప్రజలకు గౌరవాన్ని కల్పించేందుకు కృషి చేస్తోంది. అనవసర ఆరోపణలు చేయడం మానేసి, తమ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంపై దృష్టి పెట్టాలి' అని త్యాగి స్పష్టంగా పేర్కొన్నారు.

వివరాలు 

ఉగ్రవాద వ్యతిరేక పోరాటం గురించి మాట్లాడటం హాస్యాస్పదం

అలాగే, ఇటీవల చైనా అధ్యక్షతన జరిగిన భద్రతామండలి సమావేశంలోనూ, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి మహమ్మద్‌ ఇషాక్‌ దార్‌ జమ్మూకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై భారత్‌ కఠినంగా స్పందించింది. 'జైషే మహమ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే పాకిస్తాన్‌, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం గురించి మాట్లాడటం హాస్యాస్పదం' అని భారత్‌ ధీటుగా సమాధానమిచ్చింది.