NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhabesh Chandra Roy: బంగ్లాదేశ్'లో హిందూనేత హత్యపై భారత్‌ సీరియస్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bhabesh Chandra Roy: బంగ్లాదేశ్'లో హిందూనేత హత్యపై భారత్‌ సీరియస్
    బంగ్లాదేశ్'లో హిందూనేత హత్యపై భారత్‌ సీరియస్

    Bhabesh Chandra Roy: బంగ్లాదేశ్'లో హిందూనేత హత్యపై భారత్‌ సీరియస్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 19, 2025
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిన తరువాత అక్కడి మైనారిటీలు,ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి.

    ఈ తరహా హింసాకాండలకు తాజా ఉదాహరణగా, ఉత్తర బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.

    భబేశ్ చంద్ర రాయ్ అనే 58 ఏళ్ల హిందూ వ్యక్తిని గురువారం అనుమానాస్పదంగా దుండగులు కిడ్నాప్ చేసి,అనంతరం అమానుషంగా హత్య చేశారు.

    ఈ విషయంలో భారత విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది.విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా స్పందిస్తూ..భబేశ్ చంద్ర రాయ్ కిడ్నాప్, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

    ఈఘటన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న నిరంతర హింసకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.

    వివరాలు 

    దుండగులు శిక్షల బెంగ లేకుండా స్వేచ్ఛగా..

    ఇలాంటి నేరాలపై గతంలో కూడా చర్యలు తీసుకోకపోవడంతో దుండగులు శిక్షల బెంగ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు.

    హిందువులతో పాటు అన్ని మతపరమైన మైనారిటీలు భద్రతతో జీవించేందుకు తాత్కాలిక ప్రభుత్వం ఎలాంటి నెపాలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని జైస్వాల్ తేల్చిచెప్పారు.

    ఈ ఘటన గురువారం జరిగింది. భబేశ్ చంద్ర రాయ్ ఇంట్లో ఉన్న సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చి బలవంతంగా అపహరించారు.

    కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా,నరబరి గ్రామంలో భబేశ్ చంద్ర రాయ్ గాయాలతో మృత్యువుతో పోరాడుతున్న స్థితిలో కనిపించారు.

    వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

    వివరాలు 

    హిందువుల రక్షణలో మోదీ విఫలమయ్యారు: మల్లికార్జున ఖర్గే 

    ఈ దారుణ హత్యపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు.

    బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న హింస నిరంతరంగా కొనసాగుతోందని, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా మారుతున్నారని చెప్పారు.

    భబేశ్ చంద్ర రాయ్ హత్య ఈ విషయానికి ఓ స్పష్టమైన ఉదాహరణ అన్నారు.

    ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్‌తో చిరునవ్వులతో సాగించిన చర్చలు ఫలప్రదం కాలేదని ఖర్గే విమర్శించారు.

    పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం, కేవలం గత రెండు నెలల వ్యవధిలోనే హిందువులపై 76 దాడులు జరిగాయని, అందులో 23 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొన్నారు.

    అంతేకాదు, ఇతర మత మైనారిటీలపై కూడా అఘాయిత్యాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విదేశాంగశాఖ

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    విదేశాంగశాఖ

    MEA Memo: భారతీయ దౌత్యవేత్తలపై 'రహస్య మెమో'.. స్పదించిన విదేశాంగ శాఖ భారతదేశం
    Chinmoy Krishna Das: చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుపై స్పందించిన భారత్‌ ఇస్కాన్
    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత  క్రీడలు
    Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్ కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025