NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: పలు దేశాల సైనిక రాయబారులకు భారత్‌ స్పెషల్‌ బ్రీఫింగ్‌..!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: పలు దేశాల సైనిక రాయబారులకు భారత్‌ స్పెషల్‌ బ్రీఫింగ్‌..!
    పలు దేశాల సైనిక రాయబారులకు భారత్‌ స్పెషల్‌ బ్రీఫింగ్‌..!

    Operation Sindoor: పలు దేశాల సైనిక రాయబారులకు భారత్‌ స్పెషల్‌ బ్రీఫింగ్‌..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 13, 2025
    10:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉగ్రవాద ముఠాలకు మద్దతుగా నిలుస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

    'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో శత్రుదేశంపై అనేక మార్గాల్లో దెబ్బతీసిన న్యూఢిల్లీ, ఇప్పుడు పాకిస్థాన్‌పై ద్వైపాక్షికంగా ఒత్తిడి తీసుకురావడంపై దృష్టిసారించింది.

    ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు అనేక దేశాల సైనిక రాయబారులకు ప్రత్యేకంగా వివరాలు అందించనున్నది.

    ఇప్పటికే భారత్‌లో ఉన్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) సహా పలు దేశాల రక్షణ అధికారులకు, రాయబారులకు కేంద్రం సమన్లు పంపించింది.

    మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు న్యూఢిల్లీలోని రక్షణశాఖ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

    ఇందులో 'ఆపరేషన్‌ సిందూర్‌'కు సంబంధించిన ప్రధాన అంశాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకోనున్నారు.

    వివరాలు 

    ఇతర దేశాలు భారత్‌కు మద్దతుగా నిలవాలని కోరనున్న కేంద్ర ప్రభుత్వం

    ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌ తీసుకున్న ముందడుగు, ఆ తరువాత ఏర్పడిన పరిణామాలు తదితర అంశాలపై వారికి సమగ్రమైన అవగాహన కల్పించనున్నట్లు సమాచారం.

    పాకిస్థాన్‌పై జరిపిన మిలిటరీ చర్యలకు ఉన్న స్పష్టమైన కారణాలను వివరించే క్రమంలో, ఆయా దేశాలు భారత్‌కు మద్దతుగా నిలవాలని కేంద్ర ప్రభుత్వం కోరనున్నట్టు సమాచారం.

    ఈ భేటీలో విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, విదేశాంగ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీతో పాటు పలువురు ఉన్నతాధికారులు, రక్షణశాఖకు చెందిన ప్రముఖ అధికారులు హాజరయ్యే అవకాశముంది.

    వివరాలు 

    బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశం 

    బుధవారం నాడు కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. 'ఆపరేషన్‌ సిందూర్‌' నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం కలిగింది.

    భద్రతాపరంగా తీసుకోవాల్సిన తదుపరి వ్యూహాలు, సైనిక సన్నద్ధతపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.

    మే 19న పార్లమెంటరీ కమిటీ సమావేశం

    ఇక మరోవైపు, విదేశాంగ పార్లమెంటరీ స్థాయి కమిటీ సభ్యులతో కూడిన సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం మే 19న నిర్వహించనుంది.

    ఈ సమావేశానికి చైర్మన్‌గా శశి థరూర్‌ వ్యవహరించనున్నారు.

    ఈ సందర్భంగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ 'ఆపరేషన్‌ సిందూర్‌'కు సంబంధించిన వివరాలను సభ్యుల ఎదుట ఉంచనున్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Operation Sindoor: పలు దేశాల సైనిక రాయబారులకు భారత్‌ స్పెషల్‌ బ్రీఫింగ్‌..! ఆపరేషన్‌ సిందూర్‌
    Monsoon: సాధారణ తేదీ కంటే వారం ముందుగానే నైరుతి రుతుపవనాలు.. నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు! నైరుతి రుతుపవనాలు
    WTC Final: WTC ఫైనల్ కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కామెరూన్ గ్రీన్ తిరిగి జట్టులోకి.. ఆస్ట్రేలియా
    Jupiter: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ బృహస్పతిపై.. వందల రెట్ల కాంతి (వీడియో)  సైన్స్ అండ్ టెక్నాలజీ

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్': ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా పలు నగరాలకు సర్వీసులు రద్దు/నిలిపివేత భారతదేశం
    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. జైషే స్థావరం ఇలా ఉంది.. వీడియో విడుదల చేసిన బీజేపీ  భారతదేశం
    Operation Sindoor: బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం.. వైరల్‌ అయిన ఉపగ్రహ చిత్రాలు  భారతదేశం
    Opertion Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ .. రాజస్థాన్‌లో పాకిస్థాన్ బోర్డర్‌ సీల్‌.. పంజాబ్‌లో హైఅలర్ట్‌..! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025