NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్‌ కల్లోలిత ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ మోహరింపు.. అస్సాం రైఫిల్స్‌ తొలగింపుపై సైన్యం కీలక ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్‌ కల్లోలిత ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ మోహరింపు.. అస్సాం రైఫిల్స్‌ తొలగింపుపై సైన్యం కీలక ప్రకటన 
    అస్సాం రైఫిల్స్‌ తొలగింపుపై సైన్యం కీలక ప్రకటన

    మణిపూర్‌ కల్లోలిత ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ మోహరింపు.. అస్సాం రైఫిల్స్‌ తొలగింపుపై సైన్యం కీలక ప్రకటన 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 09, 2023
    01:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్‌ పై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఇండియన్ ఆర్మీలోని స్పియర్‌ కార్ప్స్ విభాగం స్పందించింది.

    కేంద్ర బలగాలు (అస్సాం రైఫిల్స్‌) ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకమైన చర్యలు జరుగుతున్నట్లు స్పియర్‌ కార్ప్స్ అభిప్రాయపడింది.

    ఈశాన్య రాష్ట్రంలో కొనసాగుతున్న హింసకాండను కట్టడి చేసేందుకు సమర్థంగా పనిచేస్తున్నామని స్పియర్ కార్ప్స్ పేర్కొంది.

    మే 3 నుంచి రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లకు వ్యతిరేకంగా శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అస్సాం రైఫిల్స్‌ శ్రమిస్తోందని తెలిపింది. అయితే రైఫిల్స్ సమగ్రతను ప్రశ్నార్థకం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పింది.

    శాంతిని నెలకొల్పేటప్పుడు విధి నిర్వహణలో ఉన్న బలగాల మధ్య విభేదాలు వస్తుంటాయని, వాటిని ఐక్య కార్యాచరణ ద్వారా పరిష్కరిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

    DETAILS

    అస్సాం రైఫిల్స్‌ కి బదులుగా మణిపూర్ పోలీసులు, CRPF బలగాలు

    మరోవైపు బఫర్‌ జోన్‌ మార్గదర్శకాలను కచ్చితత్వంతో అమలు చేయాలని ఆదేశాలున్నాయని, అందుకు అనుగుణంగానే అస్సాం రైఫిల్స్‌ వ్యవహరించినట్లు వెల్లడించింది.

    హింసాత్మక ఘటనలను కట్టడి చేసేందుకు సైన్యం, అస్సాం రైఫిల్స్‌ నిరాటంకంగా కృషి చేస్తాయని స్పియర్‌ కార్ప్స్‌ వివరించింది.

    అల్లర్ల ప్రాంతం నుంచి అస్సాం రైఫిల్స్‌ను ఉపసంహరిస్తున్నట్లు మణిపూర్ సర్కారు ప్రకటించగానే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.

    మరోవైపు దుండగులను వెంబడించకుండా అస్సాం రైఫిల్స్‌ తమను అడ్డుకుందని ఆ రాష్ట్ర పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక వర్గానికి అనుకూలంగా అస్సాం రైఫిల్స్‌ వ్యవహరిస్తోందని మైతీ మహిళలు సోమవారం ఆందోళన చేశారు.

    దీంతో అస్సాం రైఫిల్స్‌ కి బదులుగా మణిపూర్ పోలీసులు, CRPF బలగాలను కల్లోలిత ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం మోహరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    ఆర్మీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    మణిపూర్

    మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మహిళల వివస్త్ర ఘటనపై మణిపూర్‌లో ప్రజాగ్రహం.. నిరసనలు, ర్యాలీలతో హోరెత్తుతోన్న ఈశాన్యం  ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి
    మణిపూర్‌, జైపూర్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు రాజస్థాన్
    మణిపూర్ అమానుషం: నిందితులపై చర్యలకు 2 నెలల ఆలస్యంపై స్పందించిన జిల్లా ఎస్పీ భారతదేశం

    ఆర్మీ

    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత దిల్లీ
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా చైనా
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025