Page Loader
సంక్షిప్తం చేయు
BSF Jawan: పాక్ చెరలో భారత్ జవాన్.. 85 గంటల గడిచినా విడుదల లేదు!
పాక్ చెరలో భారత్ జవాన్.. 85 గంటల గడిచినా విడుదల లేదు!

BSF Jawan: పాక్ చెరలో భారత్ జవాన్.. 85 గంటల గడిచినా విడుదల లేదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2025
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాను పూర్ణం సాహూ ఇటీవల పొరపాటుతో సరిహద్దు దాటడంతో పాక్‌ సైన్యం పట్టుకున్న సంగతి తెలిసిందే.

సైనికుడు తమ భూభాగంలోకి వచ్చినందువల్లే అదుపులోకి తీసుకున్నామని పాకిస్థాన్‌ ఆర్మీ పేర్కొంది. అయితే పాకిస్థాన్ వ్యాఖ్యలను బీఎస్‌ఎఫ్ అధికారులు గట్టిగా ఖండించారు.

ఈ ఘటన జరిగిన 85 గంటలకు పైగా గడిచినా, సైనికుడి విడుదలపై పాక్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం.

ఈ పరిస్థితిలో పశ్చిమ బెంగాల్‌లో ఉన్న పూర్ణం సాహూ కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. జవాను తండ్రి తన కొడుకు భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

Details

పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచుతున్న బీఎస్‌ఎఫ్‌ 

పూర్ణం సాహూ విడుదల కోసం బీఎస్‌ఎఫ్ అధికారులు ఇప్పటికే మూడుసార్లు పాకిస్థాన్ రేంజర్స్‌తో ఫ్లాగ్‌ సమావేశాలు నిర్వహించారు.

అయినా పాక్‌ నిరంతరం ఆలస్యం చేస్తూ, సైనికుడి అప్పగింపునకు నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎఫ్‌ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది.

అధికారులు పాకిస్థాన్ సహచరులతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.

Details

ఘటన ఎలా జరిగింది? 

పూర్ణం సాహూ బీఎస్‌ఎఫ్‌ 182వ బెటాలియన్‌కు చెందినవారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

బుధవారం ఆయన సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు రక్షణగా గస్తీ కాస్తున్న సమయంలో, అస్వస్థతకు గురయ్యారు.

సమీపంలో కనిపించిన ఓ చెట్టు వద్ద విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. అయితే అది పాకిస్థాన్‌ భూభాగం అన్న విషయం ఆయన గుర్తించలేకపోయారు.

దీంతో సరిహద్దు దాటి వెళ్లిన పూర్ణం సాహూకు, పాకిస్థాన్‌ రేంజర్స్‌ చేతిలో చిక్కుకోవాల్సి వచ్చింది.