NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Baglihar Dam:బాగ్లిహార్ డ్యాం గేట్లు ఎత్తేసిన భారత్.. దాయాది దేశంలో భయం భయం..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Baglihar Dam:బాగ్లిహార్ డ్యాం గేట్లు ఎత్తేసిన భారత్.. దాయాది దేశంలో భయం భయం..
    బాగ్లిహార్ డ్యాం గేట్లు ఎత్తేసిన భారత్.. దాయాది దేశంలో భయం భయం..

    Baglihar Dam:బాగ్లిహార్ డ్యాం గేట్లు ఎత్తేసిన భారత్.. దాయాది దేశంలో భయం భయం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    01:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

    ఈ ఉగ్రదాడి ప్రతీకారంగా, భారత ప్రభుత్వం "ఆపరేషన్ సిందూర్"ను చేపట్టింది.

    ఈ ఆపరేషన్‌లో, పాకిస్తాన్ లోని పీఓకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్)లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు.

    ముఖ్యంగా, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల శిక్షణా శిబిరాలు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

    వివరాలు 

    ''సింధు జలాల ఒప్పందం'' పై అనుమానాలు

    ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, ''సింధు జలాల ఒప్పందం'' పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    భారత్, చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్, బాగ్లిహార్ డ్యామ్ల గేట్లను మూసివేయడంతో పాకిస్తాన్‌లోని నది పూర్తిగా ఎండిపోయింది.

    తాజాగా, భారత్ బాగ్లిహార్ డ్యామ్ గేట్లను ఎత్తివేయడంతో, వరద నీరు పాకిస్తాన్ వైపు ప్రవహించడం ప్రారంభించింది.

    దీంతో పాకిస్తాన్ లో మరొకసారి భయం పెరిగింది. అయితే, జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి మట్టాలు పెరిగి, గేట్లను ఎత్తినట్లు తెలుస్తోంది. దీనిని ఉద్దేశపూర్వకంగా భారత్ చేపట్టలేదని సమాచారం అందుతోంది.

    వివరాలు 

    భారత్ నీటిని ఒక అస్త్రంగా మార్చుకుంది: పాక్ 

    ఈ గేట్లు ఎత్తేయడంతో వరద నీరు పాకిస్తాన్ వైపు వెళ్ళడం ప్రారంభించింది.

    ముఖ్యంగా, ముజఫరాబాద్, సియాల్ కోట్ మరియు ఇతర నదీ ఒడ్డున ఉన్న ప్రాంతాలలో వరద ముంచెత్తే అవకాశాలు ఉన్నాయి.

    పాకిస్తాన్ ఇప్పటికే భారత్ నీటిని ఒక అస్త్రంగా మార్చుకుందని ఆరోపిస్తోంది.

    అలాగే, సింధు నది మరియు దాని ఉపనదుల నీటిని నిలిపివేయడం, పాకిస్తాన్ ప్రకారం యుద్ధ చర్యతో సమానం అని వారు అభిప్రాయపడుతున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బాగ్లిహార్ డ్యాం గేట్లు ఎత్తేసిన భారత్.. 

    🚨 Multiple gates of Baglihar Dam OPENED after HEAVY RAINFALL raises Chenab river levels.

    — With the Indus Waters Treaty in abeyance, India will decide the flow — not Islamabad. pic.twitter.com/DslTdOAHxn

    — Megh Updates 🚨™ (@MeghUpdates) May 8, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    భారతదేశం

    US-India Tariffs: అమెరికాపై ప్రతీకార సుంకాలు..?  భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుందా?  భారతదేశం
    China tariffs: చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం వల్ల భారత ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు లాభాలు  చైనా
    Tahawwur Rana: తహవ్వూర్ రాణా అప్పగింతపై భారతదేశం 14 సంవత్సరాలుగా న్యాయ పోరాటం ఎలా చేసింది? భారతదేశం
    #NewsBytesExplainer: ట్రంప్ సాయం నిలిపివేత.. రోహింజ్యాల జీవనంపై మౌన వేదన! బంగ్లాదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025