NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Explainer: సిద్ధరామయ్య చరిత్ర సృష్టించబోతున్నారా? కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు?
    తదుపరి వార్తా కథనం
    Explainer: సిద్ధరామయ్య చరిత్ర సృష్టించబోతున్నారా? కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు?
    సిద్ధరామయ్య చరిత్ర సృష్టించబోతున్నారా? కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు?

    Explainer: సిద్ధరామయ్య చరిత్ర సృష్టించబోతున్నారా? కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు?

    వ్రాసిన వారు Stalin
    May 20, 2023
    09:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌తో కలిసి సిద్ధరామయ్య శనివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

    ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసింది ఎవరు? సిద్ధరామయ్య ఎలాంటి చరిత్రను సృష్టించబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

    కర్ణాటక 9వ ముఖ్యమంత్రిగా పని చేసిన డి.దేవరాజ్ ఉర్స్ ఎక్కువ కాలం సీఎం పదవీలో కొనసాగారు. ఈయన రెండు పర్యాయాల్లో 2,790 రోజులు సీఎంగా పని చేశారు.

    ఇప్పటి వరకు ఈయనదే రికార్డు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్ నిజలింగప్ప రెండు దఫాల్లో 2,729 రోజులు పనిచేశారు. అతను కర్ణాటకకు నాల్గవ, ఏడో సీఎంగా పని చేశారు.

    కర్ణాటక

    కర్ణాటక చరిత్రలో సుధీర్ఘ కాలం సీఎంగా పని చేసిన ఏకైక నేతగా సిద్ధరామయ్య

    అయితే గత 40ఏళ్లలో 5ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన తొలి సీఎం సిద్ధరామయ్య కావడం గమనార్హం.

    కర్ణాటక చరిత్రలోనే ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన రెండో సీఎంగా సిద్ధరామయ్య నిలిచారు. డి.దేవరాజ్ ఉర్స్(5వ ముఖ్యమంత్రి) తొలిసారిగా 5ఏళ్ల 286 రోజులపాటు సీఎంగా పనిచేశారు.

    ఆ తర్వాత సిద్దరామయ్య మాత్రమే ఐదేళ్ల(5 సంవత్సరాల 4రోజులు) పదవీకాలాన్ని పూర్తి చేశారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న సిద్ధరామయ్య, ఇప్పుడు కూడా 5ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తే కర్ణాటక చరిత్రలో సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టిస్తారు.

    తద్వారా 3వేల కంటే ఎక్కువ రోజులు పని చేసిన ఏకైక సీఎంగా సిద్ధరామయ్య నిలుస్తారు. మే 2013లో తొలిసారి సిద్ధరామయ్య కర్ణాటక 28వ ముఖ్యమంత్రి అయ్యారు.

    కర్ణాటక

    కర్ణాటకలో ఏడాది కంటే తక్కువ కాలం సేవలందించిన 9మంది ముఖ్యమంత్రులు

    రాష్ట్రంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రుల జాబితాలో రామకృష్ణ హెగ్డే మూడో స్థానంలో నిలిచారు. అతను 1,967 రోజుల పాటు సీఎంగా పని చేశారు.

    కర్ణాటకలో ఏడాది కంటే తక్కువ కాలం సేవలందించిన ముఖ్యమంత్రులు తొమ్మిది మంది ఉన్నారు. వారిలో కడిదల్ మంజప్ప అతి తక్కువ రోజులు సేవలందించారు.

    కేవలం 73 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్ణాటక ముఖ్యమంత్రులలో సగానికి పైగా రెండేళ్లలోపు పనిచేసినవారే కావడం గమనార్హం.

    స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇప్పటికి వరకు జాబితాలో తొమ్మిది మంది లింగాయత్ వర్గానికి చెందినవారు ముఖ్యమంత్రులు కాగా, వొక్కాలి వర్గానికి చెందిన వారు ఏడుగురు ఉన్నారు. ఓబీసీలు ముగ్గురు, బ్రాహ్మిన్స్ ఇద్దరు, ఇతరులు ఇద్దరు చొప్పున సీఎంగా అయ్యారు.

    కర్ణాటక

    ప్రమాణ స్వీకారానికి ఇతర రాష్ట్రాల సీఎంలు

    రాష్ట్రంలో ఆరుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. వీరేంద్ర పాటిల్ రాజీనామా చేసిన తర్వాత 1971 మార్చి 19న మొదటిసారి అమల్లోకి వచ్చింది.

    ఇది దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగింది. కర్ణాటకలో చివరిసారిగా 2007లో రాష్ట్రపతి పాలన ఆరు నెలల పాటు విధించారు. మే 20న బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మెహబూబా ముఫ్తీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా డి రాజా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సెక్రటరీ జనరల్ సీతారాం ఏచూరి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారానికి హాజరవుతారని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    ముఖ్యమంత్రి
    అసెంబ్లీ ఎన్నికలు
    తాజా వార్తలు

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    కర్ణాటక

    అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు బెంగళూరు
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం
     కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ  అసెంబ్లీ ఎన్నికలు

    ముఖ్యమంత్రి

    ఈనెల 7న మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం మేఘాలయ
    మార్చి 7న నాగాలాండ్ సీఎంగా ​​ 'నీఫియు రియో' ప్రమాణస్వీకారం నాగాలాండ్
    ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు త్రిపుర
    ప్రధాని మోదీ సమక్షంలో మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం మేఘాలయ

    అసెంబ్లీ ఎన్నికలు

    Karnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్ కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు: 'రాహుల్ జీ.. కర్ణాటక సమస్యలపై గొంతు విప్పాలి'; కాంగ్రెస్ శ్రేణుల వేడుకోలు కర్ణాటక
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం  తెలంగాణ

    తాజా వార్తలు

    భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం  భారతదేశం
    ఆంధ్రప్రదేశ్: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ అరెస్ట్ నంద్యాల
    దేశంలో కొత్తగా 1,021మందికి కరోనా; 4 మరణాలు  కరోనా కొత్త కేసులు
    సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు  ఆస్ట్రేలియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025