NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Shinkansen Trains: ముంబై-అహ్మదాబాద్ రూట్లో.. బుల్లెట్ రైలు టెస్టింగ్  కోసం జపాన్ షింక‌న్‌సెన్ రైళ్లు   
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Shinkansen Trains: ముంబై-అహ్మదాబాద్ రూట్లో.. బుల్లెట్ రైలు టెస్టింగ్  కోసం జపాన్ షింక‌న్‌సెన్ రైళ్లు   
    ముంబై-అహ్మదాబాద్ రూట్లో.. బుల్లెట్ రైలు టెస్టింగ్ కోసం జపాన్ షింక‌న్‌సెన్ రైళ్లు

    Shinkansen Trains: ముంబై-అహ్మదాబాద్ రూట్లో.. బుల్లెట్ రైలు టెస్టింగ్  కోసం జపాన్ షింక‌న్‌సెన్ రైళ్లు   

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 18, 2025
    01:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబై నుంచి అహ్మదాబాద్ వరకూ నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన ట్రాక్‌పై టెస్టింగ్ నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం రెండు షింకెన్‌సెన్ రైళ్లను ఉచితంగా ఇవ్వబోతోందని సమాచారం.

    హై స్పీడ్ రైల్ కారిడార్‌ను పరీక్షించేందుకు జపాన్ ముందుకొచ్చి ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది.

    ఈ రైళ్లు ఈ5, ఈ3 సిరీస్‌లకు చెందినవిగా ఉండగా, వచ్చే సంవత్సరం ఆరంభంలో భారత్‌కు రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

    ఈ హై స్పీడ్ ట్రాక్‌పై ఈ రైళ్లను ప్రయోగాత్మకంగా నడిపించి, అత్యవసర డేటాను సేకరించనున్నారు.

    ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము వంటి పర్యావరణ సవాళ్లకు రైళ్లు ఎలా ప్రతిస్పందిస్తున్నాయన్న అంశాలపై పరిశీలన జరగనుంది.

    వివరాలు 

     హైస్పీడ్ రైళ్లను 2030 నాటికి భారత్‌లో.. 

    షింకెన్‌సెన్ రైళ్ల ద్వారా ముంబై-అహ్మదాబాద్ మార్గంలో డ్రైవింగ్ పరిస్థితులు, వేడినీటి ప్రభావాలు వంటి అంశాలపై కీలక సమాచారం సేకరించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

    టెస్టింగ్ దశలోనే "ఈ10" మోడల్‌కు సంబంధించిన రైళ్ల తయారీపై కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

    ఈ10 డిజైన్‌లో తయారయ్యే తదుపరి తరం హైస్పీడ్ రైళ్లను 2030 నాటికి భారత్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

    తదుపరి తరం హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చే వరకు దేశీయంగా అభివృద్ధి చేస్తున్న సెమీ హైస్పీడ్ రైళ్లను వినియోగంలోకి తేనుందుకు భారత్ యోచిస్తోంది.

    ఈ నేపథ్యంలో రైళ్ల వేగాన్ని మరింత మెరుగుపరచేందుకు అవసరమైన మార్పులు చేయనున్నారు.

    వివరాలు 

    జపాన్ షింకెన్‌సెన్ టెక్నాలజీ.. రైళ్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు

    జపాన్ షింకెన్‌సెన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందిస్తున్న ఈ రైళ్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది.

    ఈ5 సిరీస్ రైళ్లు స్లీక్ డిజైన్‌తో, అత్యాధునిక టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేయబడ్డాయి.

    ఇక ఈ3 సిరీస్ రైళ్లు ప్రయాణికుల సౌకర్యం, సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడ్డాయి.

    ఈ రెండు మోడళ్లు జపాన్ ఇంజినీరింగ్ నైపుణ్యానికి చక్కని నిదర్శనంగా నిలిచాయి.

    ఇక జపాన్ పంపిన ఈ రైళ్లను ఉపయోగించి భారత అధికారులు ట్రాక్ మరియు ఆపరేషనల్ పనితీరును విశ్లేషించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

    దీనివల్ల భారతదేశంలో హైస్పీడ్ రైలు వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన సాంకేతిక సమాచారం లభించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జపాన్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    జపాన్

    Japan Earthquake: జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్‌ భూకంపం
    Japan visa: భారత విద్యార్థులకు జపాన్ శుభవార్త.. స్టూడెంట్ ఐడీ వీసా జారీ  వీసాలు
    Japan Earthquake: రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో సంభవించిన బలమైన భూకంపం... వణికిన జపాన్  భూకంపం
    Earthquake in Taiwan: తైవాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం.. భారీ విధ్వంసం.. సునామీ హెచ్చరిక జారీ తైవాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025