Page Loader
సంక్షిప్తం చేయు
Karnataka Crowd Bill: తొక్కిసలాట తరువాత కర్ణాటక సర్కార్ నూతన చట్టం ..ఉల్లంఘిస్తే.. భారీ జరిమానా,మూడేళ్ల జైలు
ఉల్లంఘిస్తే.. భారీ జరిమానా,మూడేళ్ల జైలు

Karnataka Crowd Bill: తొక్కిసలాట తరువాత కర్ణాటక సర్కార్ నూతన చట్టం ..ఉల్లంఘిస్తే.. భారీ జరిమానా,మూడేళ్ల జైలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ దుర్ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది.

దీనికి "కర్ణాటక జన సమూహ నియంత్రణ బిల్లు.. 2025 (Crowd Control Bill 2025)" అనే పేరును నిర్ణయించింది.

జూన్ 19న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో ఈ బిల్లుపై చర్చ జరిగింది.

వివరాలు 

నియమాలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు 

బిల్లులోని ప్రతిపాదనలు ప్రకారం,ఇకపై కర్ణాటక రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ ర్యాలీలు, బహిరంగ సమావేశాలు, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు, ఇతర పెద్దగా జన సమూహం పాల్గొనే వేడుకలకు ప్రభుత్వం నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరిగా మారుతుంది.

ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు విధించనున్నారు.

భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల లేదా తొక్కిసలాటల సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైతే, ఆయా కార్యక్రమ నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారిని మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా ఎదుర్కోవలసి ఉంటుంది.

వివరాలు 

చట్టంలో కొన్ని మినహాయింపులు

అయితే ఈ చట్టం కొన్ని మినహాయింపులను కలిగి ఉంటుంది. రాష్ట్రంలో జరిగే జాతరలు, రథోత్సవాలు, పల్లకీ ఊరేగింపులు, తెప్పోత్సవాలు (తెప్పాడ తేరు), ఉర్స్ వంటి మతపరమైన లేదా సాంప్రదాయ కార్యక్రమాలకు ఈ చట్టం వర్తించదు.

ఈ వేడుకలు చట్ట పరంగా మినహాయింపునకు అర్హమవుతాయి.

ఇక జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై తిరిగి దృష్టి పెట్టినట్లయితే, ఆ రోజున చినస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో భయంకరమైన తొక్కిసలాట జరగడంతో 11 మంది యువకులు దుర్మరణం చెందారు.

అలాగే మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై దేశమంతా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

వివరాలు 

 అనుమతి లేకుండా ర్యాలీ 

తొక్కిసలాటకు బీసీసీఐ, ఆర్సీబీ ఫ్రాంఛైజ్ ప్రధాన కారణమని కర్నాకట ప్రభుత్వం ఆరోపించింది.

ప్రభుత్వ అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని ప్రభుత్వం వెల్లడించింది.

విజయోత్సవ ర్యాలీకి ముందుగా అనుమతి తీసుకోకపోవడం వల్లనే పరిస్థితులు అదుపుతప్పాయని అధికారికంగా తెలిపింది.