NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర పునఃప్రారంభం.. భారత్- పాక్ సరిహద్దులో తగ్గిన వరదలు
    తదుపరి వార్తా కథనం
    కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర పునఃప్రారంభం.. భారత్- పాక్ సరిహద్దులో తగ్గిన వరదలు
    కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర నేటి నుంచి పునఃప్రారంభం

    కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర పునఃప్రారంభం.. భారత్- పాక్ సరిహద్దులో తగ్గిన వరదలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 25, 2023
    10:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్తార్ పూర్ కారిడార్ యాత్ర మంగళవారం పునఃప్రారంభమైంది. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను భారతదేశంలోని గురుదాస్‌పూర్ జిల్లాలోని గురుద్వారా డేరా బాబా నానక్‌తో కలుపుతూ కర్తార్‌పూర్ కారిడార్‌కు నిర్మాణం చేశారు.

    భారత, పాక్ సరిహద్దుల్లో వరదలు తగ్గుముఖం పట్టడంతో మంగళవారం నుంచి కర్తార్ పూర్ కారిడార్ యాత్ర పునఃప్రారంభమైంది.

    భారీ వరదల నేపథ్యంలో సోమవారం సాయంత్రం సరిహద్దు రేంజ్ అమృత్‌సర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) నరీందర్ భార్గవ్ కారిడార్‌ను సందర్శించారు. అనంతరం అక్కడి పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

    ఇరుదేశాల మధ్య కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర నవంబర్ 9, 2019న ప్రారంభమైంది.

    DETAILS

    యాత్రకు 132 మంది సిక్కు భక్తులు పేర్లు నమోదు

    గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల ధాటికి సరిహద్దుల్లోని రావి నది నీటి మట్టం అమాంతం పెరగడంతో భారత్‌ - పాక్‌ సరిహద్దులో వరదలు సంభవించాయి. ఈ కారణంగా గతంలోనే యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు డీఐజీ నరీందర్ భార్గవ్ వెల్లడించారు.

    ప్రస్తుతానికి అక్కడ యథాస్థితి పరిస్థితి నెలకొనడంతో మంగళవారం నుంచి కారిడార్‌ను తిరిగి తెరవాలని నిర్ణయించినట్లు నరీందర్ వివరించారు. మరోవైపు గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ హిమాన్షు అగర్వాల్ సైతం కర్తార్‌పూర్ కారిడార్‌లో పర్యటించారు.

    మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్న కర్తార్‌పూర్ కారిడార్ యాత్రకు 132మంది సిక్కు భక్తులు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    పాకిస్థాన్

    తాజా

    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్
    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ

    భారతదేశం

    దావూద్‌ మాదిరిగానే ఎదిగిన బిష్ణోయ్‌ గ్యాంగ్: ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు  ఎన్ఐఏ
    మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు ఈజిప్ట్
    గ్రేట్ ఫ్రెండ్ మోదీకి రష్యా అధ్యక్షుడి ప్రశంసలు..మేకిన్‌ ఇండియా ఫలితాలు కనిపిస్తున్నాయని కితాబు నరేంద్ర మోదీ
    IMD: రైతులకు శుభవార్త: జులైలో సాధారణ వర్షపాతం నమోదు ఐఎండీ

    పాకిస్థాన్

    పాక్ ఆర్థిక తిప్పలు; న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్ హోటల్‌ ను లీజుకిచ్చిన దాయాది దేశం  న్యూయార్క్
    మే9 హింసకాండ నిందితులను వదలబోం: ఆర్మీ చీఫ్ అంతర్జాతీయం
    VIDEO: పాకిస్థాన్ ఆటగాడు స్టంపౌట్.. నవ్వుకున్న నెటిజన్లు క్రికెట్
    వన్డే వరల్డ్ 2023లో మరో కొత్త ట్విస్ట్.. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడలేమన్న పాకిస్థాన్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025