Page Loader
Khalistani Terrorist: ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపులు..
ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపులు..

Khalistani Terrorist: ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపులు..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2024
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025లో జరగబోయే మహా కుంభమేళా సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను హత్య చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోలో హెచ్చరించారు. ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసినందుకు ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. పన్నూన్ చేసిన ప్రకటన ప్రకారం, 2025 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 3 వరకు దాడులు జరుగుతాయని, ఆ సమయంలో మోదీ, యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్‌లో ఉంటారని చెప్పారు.

వివరాలు 

భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి

ఈ మహా కుంభమేళానే ఈ ఇద్దరు నాయకుల జీవితం ముగిసే స్థలంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో యూపీ, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులను హతమర్చారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఘటనాస్థలంలో రెండు ఏకే-47 తుపాకులు, రెండు గ్లాక్ పిస్టల్స్, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.