NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mallikharjun Kharge: ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం.. కేటాయించిన భూమిని తిరిగిచ్చేందుకు సిద్ధం..! 
    తదుపరి వార్తా కథనం
    Mallikharjun Kharge: ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం.. కేటాయించిన భూమిని తిరిగిచ్చేందుకు సిద్ధం..! 
    ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం.. కేటాయించిన భూమిని తిరిగిచ్చేందుకు సిద్ధం..!

    Mallikharjun Kharge: ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం.. కేటాయించిన భూమిని తిరిగిచ్చేందుకు సిద్ధం..! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 13, 2024
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలో ముడా స్కాంపై కొనసాగుతున్న దర్యాప్తు నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.

    ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్, కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (కేఐఏడీబీ) మంజూరు చేసిన ఐదు ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

    ఈ భూమి కర్ణాటక ప్రభుత్వం ద్వారా బగలూరులోని హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ హార్డ్‌వేర్ సెక్టార్‌లో కేటాయించారు. సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు భూమి కేటాయింపుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.

    ఈ ట్రస్ట్‌లో మల్లిఖార్జున్ ఖర్గే, ఆయన కుమారుడు రాహుల్ ఖర్గే, అల్లుడు రాధాకృష్ణ సభ్యులుగా ఉన్నారు.

    Details

    భూ కేటాయింపులో అవకతవకలు

    భూమి కేటాయింపు పద్ధతిలో అవకతవకలు జరిగాయని దినేష్ కల్లహల్లి అనే వ్యక్తి గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌కు ఫిర్యాదు చేశారు.

    ఈ ఆరోపణలపై సీరియస్‌గా స్పందించిన ఖర్గే కుటుంబం, ట్రస్టుకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమవుతోందని తెలిసింది.

    రాహుల్ ఖర్గే నేతృత్వంలోని ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకోవడం కర్ణాటక రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసింది.

    ఈ వ్యవహారం పై బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్ర విమర్శలు చేశారు.

    Details

    సీఎంపై మనీలాండరింగ్ కేసు

    ప్రభుత్వ అధికార దుర్వినియోగంతోనే భూమి కేటాయించారని ఆయన ఆరోపించారు.

    అయితే కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ, రాహుల్ ఖర్గే దరఖాస్తు ఆధారంగా అన్ని అర్హతలను పరీక్షించి మెరిట్ పద్ధతిలోనే భూమిని కేటాయించినట్లు స్పష్టం చేశారు.

    కర్ణాటకలో ముడా స్కాం ప్రస్తుత రాజకీయాల్లో పెద్ద వివాదం రేపుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కూడా మనీలాండరింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మల్లికార్జున ఖర్గే
    కాంగ్రెస్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మల్లికార్జున ఖర్గే

    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కర్ణాటక
    సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?  కర్ణాటక
    పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే బెంగళూరు

    కాంగ్రెస్

    Amethi-Raebareli Candidates: అమేథీ-రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా?  ప్రియాంక గాంధీ
    Congress: రాయ్‌బరేలీ-అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు భారతదేశం
    KL Sharma: అమేథీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీకి నిలబడిన కేఎల్ శర్మ ఎవరు?  భారతదేశం
    New India-PM Modi-Pakistan: ఇది సరికొత్త భారత్...పాక్ పప్పులుడకట్లేదు: ప్రధాని నరేంద్రమోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025