Page Loader
Kolkata: కోల్‌కతా ఆసుపత్రి కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్ రోగులకు చికిత్స ఇవ్వమని ప్రకటన
కోల్‌కతా ఆసుపత్రి కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్ రోగులకు చికిత్స ఇవ్వమని ప్రకటన

Kolkata: కోల్‌కతా ఆసుపత్రి కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్ రోగులకు చికిత్స ఇవ్వమని ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 30, 2024
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని జేఎన్ రే ఆసుపత్రి కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ రోగులకు చికిత్స అందించమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం భారతదేశ జెండాను అవమానించడమే కాకుండా, బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరిగే దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆసుపత్రి అధికారి సుభ్రాంషు భక్త్ శుక్రవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ రోజు నుంచి నిరవధికంగా బంగ్లాదేశ్ రోగులను చికిత్స కోసం అంగీకరించమని నిర్ణయించుకున్నామని, వారు భారత్‌ పట్ల చూపించిన అవమానాల కారణంగా ఈ చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

Details

 త్రివర్ణ పతాకాన్ని అవమానించిన బంగ్లాదేశ్ 

బంగ్లాదేశ్ ప్రజలు తాజాగా భారతదేశ వ్యతిరేక భావాలను వ్యక్తం చేస్తూ త్రివర్ణ పతాకాన్ని అవమానించినారని అన్నారు. ఈ నేపథ్యంలో, ఇతర ఆసుపత్రులు కూడా బంగ్లాదేశ్ రోగులకు చికిత్స ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తమ నిర్ణయానికి ఇతర ఆసుపత్రులు మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నామని కూడా చెప్పారు.