NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra News: అవసరాలు తేల్చాక నీటి కేటాయింపులు.. కృష్ణా బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయం 
    తదుపరి వార్తా కథనం
    Andhra News: అవసరాలు తేల్చాక నీటి కేటాయింపులు.. కృష్ణా బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయం 
    అవసరాలు తేల్చాక నీటి కేటాయింపులు.. కృష్ణా బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయం

    Andhra News: అవసరాలు తేల్చాక నీటి కేటాయింపులు.. కృష్ణా బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 25, 2025
    09:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నాగార్జునసాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లు ముందుగా సమావేశమై, నీటి అవసరాలను ముందు పక్కాగా తేల్చాలి.

    కుడి, ఎడమ కాలువల కింద ఎంత భూభాగం సాగుకు ఉంది? ఆయకట్టు అవసరాలను తీర్చేందుకు ఎన్ని తడులు అవసరమో స్పష్టత ఇవ్వాలి. తాగునీటి అవసరాల వివరాలు గణించాలి.

    రెండు రాష్ట్రాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని, బుధవారం కృష్ణా బోర్డు మళ్లీ సమావేశమై శ్రీశైలం, సాగర్ జలాశయాల్లోని నీటి నిల్వల ఆధారంగా జూన్ నెల వరకు నీటి కేటాయింపులను నిర్ణయించనుంది.

    ఈ అత్యవసర సమావేశం సోమవారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు ఛైర్మన్ అతుల్‌జైన్ అధ్యక్షతన జరిగింది.

    వివరాలు 

    తెలంగాణ వాదన 

    ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.

    సాగర్ చీఫ్ ఇంజినీర్ల సమావేశం ఆలస్యమైతే బోర్డు సమావేశం కూడా ఆలస్యమయ్యే అవకాశముంది.

    నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని వినియోగించుకుంది.ఈ ఏడాది ఏపీ వాటాగా 666 టీఎంసీలు ఉండగా,ఇప్పటికీ 639 టీఎంసీలకుపైగా వాడుకుంది.

    శ్రీశైలం నుంచి కూడా ఎక్కువగా నీటిని మళ్లించింది.తెలంగాణ మాత్రం 211 టీఎంసీలే వినియోగించింది.

    ఉమ్మడి జలాశయాల నుంచి ఇక ఏపీ నీటిని వినియోగించకుండా ఆపాలని,జూన్ వరకు సాగుకు 90 టీఎంసీలు,తాగునీటి అవసరాలకు 17 టీఎంసీలు,జూలైలో మరో 9 టీఎంసీలు అవసరమని తెలంగాణ ప్రతినిధులు రాహుల్ బొజ్జా,అనిల్‌కుమార్ వాదించారు.

    వివరాలు 

    విద్యుదుత్పత్తిపై వివాదం 

    సోమశిల,కండలేరు,గండికోట జలాశయాల్లో ఏపీకి నీరు అందుబాటులో ఉందని గుర్తుచేశారు.

    కృష్ణా బోర్డు నిబంధనల ప్రకారం, వరద నీరు వదిలే సమయంలోనే విద్యుదుత్పత్తి చేయాలి.

    అయితే, తెలంగాణ ఈ నియమాన్ని పాటించలేదని, వరద లేకున్నా 117 టీఎంసీలను విద్యుదుత్పత్తికి వినియోగించిందని ఏపీ ఆరోపించింది.

    వరద నీరు లభించినపుడు ఏపీ మళ్లింపు చేసుకోవడం తప్పేం కాదని పేర్కొంది. గతంలో మళ్లించిన నీటి లెక్కలు ఇప్పుడు తీసుకురావడం అనుచితమని అభిప్రాయపడింది.

    వివరాలు 

    బోర్డు నివేదిక 

    బోర్డు ఛైర్మన్ అతుల్‌జైన్ మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ వరద సమయంలోనే నీటిని వినియోగించింది.

    నవంబరులో వరదలొచ్చిన తర్వాత జలాశయాల్లో నీటి నిల్వ పెరిగింది. ఏపీ వినియోగించినది వరద నీటేనని లెక్కలు చెబుతున్నాయి," అని స్పష్టం చేశారు.

    అంతేకాకుండా, రాష్ట్రాల ఆయకట్టుకు ఇబ్బంది కలగకుండా నీటి కేటాయింపులను చేయాలని ఏపీ చీఫ్ ఇంజినీర్ సూచించారు.

    అన్ని అవసరాలను పక్కాగా నిర్ణయించి, తగిన నీటి పంపిణీకి బోర్డు అంగీకరించింది.

    ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లలో కలిపి 66 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

    జూన్ తర్వాత తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం 800 అడుగుల దిగువన 16 టీఎంసీలు, సాగర్‌లో 510-500 అడుగుల మధ్య 15 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. మిగిలిన నీటిని అవసరాలను అనుసరించి పంచుతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం? ఎలాన్ మస్క్
    UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె

    ఆంధ్రప్రదేశ్

    AP: ఏపీ క్రీడాకారులకు కూటమి ప్రభుత్వ శుభవార్త .. రూ.8 కోట్లు విడుదల  భారతదేశం
    AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! భారతదేశం
    CM Chandrababu: పాలనలో వేగం పెంచడానికే మంత్రులకు ర్యాంకులు : సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    SVAMITVA scheme: స్వమిత్వ పథకం పనులకు నూతన ఊపు.. మళ్లీ ప్రారంభమైన సర్వేలు  తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    తెలంగాణ

    Telangana: తెలంగాణలో ఒక్కసారిగా వేడి వాతావరణం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన గాలిలో తేమ వాతావరణ మార్పులు
    Telangana: వానాకాలం ధాన్యం మిల్లింగ్‌పై పౌరసరఫరాల శాఖ దృష్టి.. ఉగాది నుంచి రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ! భారతదేశం
    Tg New Ration Cards : రేషన్ కార్డు అప్లికేషన్ల పేరిట దోపిడీ చేస్తే.. ఈ నంబర్​కు కాల్​ చేయండి భారతదేశం
     TG Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు నిధులు జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025