NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress Vs BJP: కుంభమేళా వివాదం.. బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
    తదుపరి వార్తా కథనం
    Congress Vs BJP: కుంభమేళా వివాదం.. బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
    కుంభమేళా వివాదం.. బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

    Congress Vs BJP: కుంభమేళా వివాదం.. బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 03, 2025
    11:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కుంభమేళా, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాలకు హాజరు కాకపోవడంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వాదోపవాదాలు మరింతగా ముదిరాయి.

    ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసింది.

    ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలపై నేరుగా విమర్శలు చేస్తూ, వారు హిందూ వ్యతిరేకులని ఆరోపించింది.

    బీజేపీ విమర్శలు

    బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ రాహుల్ గాంధీ కుటుంబం హిందూ మతాన్ని వ్యతిరేకిస్తోంది. బాబ్రీ మసీదుకు మూడుసార్లు వెళ్లిన రాహుల్ గాంధీ, రాముడి ఆలయాన్ని మాత్రం సందర్శించలేదు.

    ఆయన తరచుగా రాయ్‌బరేలికి వెళ్తారు. 120 కి.మీ దూరంలో ఉన్న ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు మాత్రం హాజరుకాలేకపోయారని వ్యాఖ్యానించారు.

    Details

    హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు

    ఇదే సమయంలో బీజేపీ మరో విమర్శ చేస్తూ, శతాబ్దాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మితమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జనవరి 22, 2024న రామ్‌లాలా ప్రాణ ప్రతిష్ట జరిగింది.

    కానీ ఆలయ నిర్మాణానికి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఆహ్వానం అందుకున్నా వేడుకకు హాజరుకాలేదు.

    వారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఫొటోలు షేర్ చేసింది.

    Details

    కాంగ్రెస్ కౌంటర్

    బీజేపీ విమర్శలపై మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు.

    బీహార్ సీఎం నితీష్ కుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ఉప సీఎం అజిత్ పవార్, కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వంటి బీజేపీ మిత్రపక్ష నేతలు కూడా కుంభమేళాకు హాజరుకాలేదు.

    వీరిని కూడా హిందూ వ్యతిరేకులుగా పరిగణిస్తారా? అంటూ ప్రశ్నించారు.

    బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఈ మాటల తూటాలు పెరుగుతున్న తరుణంలో, భవిష్యత్తులో మరిన్ని ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    కాంగ్రెస్

    తాజా

    India vs America: అమెరికా 10% సుంకాన్ని ఉపసంహరించకపోతే ప్రతీకార చర్యలు తప్పవు : భారత్ అమెరికా
    Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం.. ప్రచార సభలో కాల్పులు కొలంబియా
    Lalithaa Jewellery: రూ.1700 కోట్లతో స్టాక్ మార్కెట్‌లోకి లలితా జువెలరీ.. తొలిసారిగా ఐపీఓ దిశగా అడుగులు ఐపీఓ
    Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత బీఆర్ఎస్

    బీజేపీ

    "Fake Voters": ఢిల్లీ ఎన్నికలకు ముందు బీజేపీ,ఆప్ పోస్టర్ వార్ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Delhi: ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా! దిల్లీ
    Ramesh Bidhuri: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత ప్రియాంక గాంధీ
    Congress-BJP: ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు.. నాంపల్లిలో కాంగ్రెస్‌-బీజేపీ కార్యకర్తల ఘర్షణ కాంగ్రెస్

    కాంగ్రెస్

    NHRC: ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం  భారతదేశం
    Congress: ఎన్నికల నిబంధనలలో సవరణలు.. సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్  ఎన్నికల సంఘం
    India Bloc: ఇండియా కూటమి రాజకీయంలో మరో కీలక పరిణామం.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్‌! ఇండియా కూటమి
    Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ కన్నుమూత మన్మోహన్ సింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025