NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ap Weather Updates : అమ్మబాబోయ్.! ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. రాయలసీమ మీదుగా మరో ఉపరితల ద్రోణి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ap Weather Updates : అమ్మబాబోయ్.! ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. రాయలసీమ మీదుగా మరో ఉపరితల ద్రోణి

    Ap Weather Updates : అమ్మబాబోయ్.! ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. రాయలసీమ మీదుగా మరో ఉపరితల ద్రోణి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 21, 2025
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ప్రాంతానికి వాతావరణశాఖ వర్ష సూచన జారీ చేసింది.

    ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది.

    అయితే, మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుందని తెలిపింది.

    తెలంగాణకు మాత్రం వర్ష సూచన లేదు. వాతావరణ మార్పుల కారణంగా, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, అంతర్గత ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం ఇది ఉత్తర బంగ్లాదేశ్ నుంచి తెలంగాణ వరకు సుమారు 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. అయితే, ఇది ప్రస్తుతం బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

    వివరాలు 

    ఉపరితల ద్రోణి తూర్పు ప్రాంతంలో రాయలసీమ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు

    అంతేకాక, మరో ఉపరితల ద్రోణి తూర్పు ప్రాంతంలో రాయలసీమ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు విస్తరించి ఉంది.

    ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించినట్లు తాజా వాతావరణ బులెటిన్‌లో పేర్కొన్నారు.

    ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

    ఉదయాన్నిపూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

    గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి 2-3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

    వివరాలు 

    రాయలసీమ ప్రాంతంలో  మూడు రోజులు పొడి వాతావరణమే.. 

    దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం కొనసాగనుంది. కానీ, ఉదయాన్నిపూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశముంది.

    ఇదే సమయంలో, ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి 2-3 డిగ్రీల మేర పెరిగే సూచనలు ఉన్నాయి.

    రాయలసీమ ప్రాంతంలో కూడా రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే కొనసాగుతుందని తెలిపింది.

    ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి 2-3 డిగ్రీల మేర పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఏ విధమైన వాతావరణ హెచ్చరికలు లేవని స్పష్టంగా ప్రకటించారు.

    వివరాలు 

    తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు

    తెలంగాణలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. ఉదయం వేళ కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

    ఉష్ణోగ్రతల్లో ఎలాంటి గణనీయమైన మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

    గత గురువారం తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురవగా, వాతావరణం కొద్దిగా చల్లబడింది.

    అయితే, తాజా వాతావరణ బులెటిన్ ప్రకారం రాబోయే రోజుల్లో రాష్ట్రానికి వర్ష సూచన లేదని స్పష్టంగా పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాతావరణ శాఖ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌
    COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి  పశ్చిమ బెంగాల్
    S-400 missile systems: 2026 నాటికి భారతదేశానికి మిగిలిన S-400 క్షిపణి వ్యవస్థలు  రష్యా

    వాతావరణ శాఖ

    Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి భారీ వర్షాలు  భారతదేశం
    Heavy rains: అలర్ట్.. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు తెలంగాణ
    Monsoon: రైతులకు వాతావరణ విభాగం బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు వర్షాలు   వాతావరణ మార్పులు
    AP Rains: అలర్ట్.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Vizag Railway Zone: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ  కేంద్ర ప్రభుత్వం
    APTDC: విశాఖ నుంచి కాకినాడకి విలాస నౌక.. 'క్రూజ్‌ పర్యటన'పై నిర్వాహకుల దృష్టి భారతదేశం
    AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ భారతదేశం
    AP News: ఏపీలో ఫిబ్రవరి నెలలోనే మండుతున్న ఎండలు.. 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు.. ఇబ్బందిపడుతున్న ప్రజలు  వాతావరణ మార్పులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025