NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mp Raghurama : మోదీజీ ఆ ఇద్దరు ఐపీఎస్‎లు నన్ను వేధించారు..చర్యలు తీసుకోండి
    తదుపరి వార్తా కథనం
    Mp Raghurama : మోదీజీ ఆ ఇద్దరు ఐపీఎస్‎లు నన్ను వేధించారు..చర్యలు తీసుకోండి
    కస్టడీలో వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

    Mp Raghurama : మోదీజీ ఆ ఇద్దరు ఐపీఎస్‎లు నన్ను వేధించారు..చర్యలు తీసుకోండి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 02, 2023
    11:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

    ఈ మేరకు తనను కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

    తనపై దాడి జరిపిన అధికారుల్లో పీవీ సునీల్ కుమార్, పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారులున్నారని ఫిర్యాదు చేశారు.

    లోక్‌సభ నాయకుడిగా ప్రధాన మంత్రి తనపై జరిగిన దాడికి సంబంధించి సీబీఐ, ఎన్‌ఐఏల దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. తనపై దాడి పట్ల పార్లమెంట్ కమిటీ ద్వారాను విచారణ జరిపించాలన్నారు.

    సీఐడీ అధికారుల కాల్ డేటాలను భద్రపరిచేలా చూడాలని, ఇదే సమయంలో తన కస్టోడియల్ టార్చర్‌పై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టులో గతంలోనే రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.

    details

    కాల్ డేటాను సేకరించాలని సీబీఐను ఆదేశించిన హైకోర్టు 

    స్పందించిన ఉన్నత న్యాయస్థానం రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో సీఐడీ అధికారుల కాల్‌ డేటాను భద్ర పరచాలని సీబీఐను ఆదేశించింది.కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది.

    మరోవైపు సీబీఐ వాదనలపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.పిటిషనర్ సీఐడీ మీద ఆరోపణలు చేశారని, కాల్ డేటా సేకరించాలని సీఐడీనే ఎలా ఆదేశిస్తామని న్యాయవాదిని ప్రశ్నించింది.

    దీంతో సీఐడీ అధికారులు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా, కాల్ డేటా సేకరించాలనడం చట్టవిరుద్ధమని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

    ఈ కేసు దర్యాప్తు సీబీఐకు ఇవ్వాలా వద్దా అన్న అంశంపై కోర్టు ఇంకా నిర్ణయించలేదని,రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ చెప్పారు. ఈ మేరకు కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    నరేంద్ర మోదీ

    తాజా

    Mumbai Rain: ముంబైను ముంచెత్తిన కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం.. వాహనదారులకు ఇక్కట్లు ముంబై
    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్

    ఆంధ్రప్రదేశ్

    తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్ళు, వాటి వివరాలు, టికెట్ ధరల ఇవే..   రైల్వే శాఖ మంత్రి
     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    చంద్రబాబు కి మరో షాక్..అక్టోబర్ 5 వరకు  రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు  భారతదేశం
    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం  సచివాలయం

    నరేంద్ర మోదీ

    లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. 'చారిత్రక దినం'గా అభివర్ణించిన ప్రధాని మోదీ  మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి?  మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    వాట్సాప్ ఛానెల్స్ లో జాయిన్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ, మొదటి పోస్ట్ ఇదే  వాట్సాప్
    పార్లమెంటులో నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ.. భారత్- కెనడా సంబంధాలపై కీలక చర్చ పార్లమెంట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025