NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌ 
    డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌

    Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 09, 2025
    05:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్‌లో జరిగిన దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కీలకంగా మారారు.

    ఈ ఆపరేషన్‌లో ప్రధాన పాత్ర పోషించిన ఆయనకు ఇప్పుడు మరో గొప్ప బాధ్యతను భారత ప్రభుత్వం అప్పగించింది.

    ఆయనను 'డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్'గా నియమించడమే కాక, ఇకపై ఆయన 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్' (DGMO) హోదాలోనూ పనిచేయనున్నారు.

    రక్షణ మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. భారత సైన్యం,నిఘా వ్యవస్థలు, ఇతర కీలక విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచేందుకు 'డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ - స్ట్రాటజీ' అనే కొత్త పదవిని రూపొందించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    వివరాలు 

    అత్యుత్తమ యుద్ధ సేవకు గౌరవం 

    ఈ హోదా భారత ఆర్మీలో అత్యంత ప్రాధాన్యం ఉన్న పదవుల్లో ఒకటిగా పేర్కొనబడింది.

    2025, జూన్ 4న నిర్వహించిన 'డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెర్మనీ' సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌కు 'ఉత్తమ యుద్ధ సేవా పతకం' ప్రదానం చేశారు.

    ఈ సందర్భంగా ఆయన ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనిక మీడియా సమావేశానికి నేతృత్వం వహించారు.

    ఈ సమయంలో పాకిస్థాన్‌ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్‌కు కాల్ చేసి కాల్పుల విరమణ విషయంపై చర్చించారు.

    అనంతరం మే 12న జరిగిన మీడియా సమావేశంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించారు.

    వివరాలు 

    లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఎవరు? 

    లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, కుమావున్ రెజిమెంట్‌కు చెందిన సీనియర్ అధికారి.

    ఆయన భారత సైన్యంలో అనేక కీలక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు.

    డీజీఎంఓగా నియమించబడే ముందు, ఆయన చినార్ కార్ప్స్‌కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC)గా పనిచేశారు.

    విశేషంగా జమ్ముకశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యల సందర్భంగా జరిగిన అనేక కీలక మిషన్లలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.

    ఈ అనుభవం, నైపుణ్యం ద్వారా ఆయన భారత సైన్యంలో ఒక విశ్వసనీయ నాయకుడిగా గుర్తింపు పొందారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్మీ

    తాజా

    Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌  ఆర్మీ
    Honeymoon Couple Missing: హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు  మేఘాలయ
    #NewsBytesExplainer: 'అమరావతి వేశ్యల రాజధాని' వ్యాఖ్య కలకలం.. రాష్ట్రంలో భగ్గుమన్న నిరసనలు.. అసలేం జరిగింది? అమరావతి
    World Test Championship: ఆసీస్ జట్టుకు అవమానం.. లార్డ్స్‌లో ప్రాక్టీస్‌కు ప్లేయర్లకు నిరాకరణ! ఆస్ట్రేలియా

    ఆర్మీ

    జాతివివక్ష వల్లే అమెరికా సైనికుడు మా వద్దకు వచ్చాడు: ఉత్తర కొరియా  ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    లద్దాఖ్: వాహనం లోయలో పడి 9మంది ఆర్మీ సిబ్బంది మృతి  లద్దాఖ్
    జమ్ముకశ్మీర్: పుల్వామాలో ఎన్‌కౌంటర్‌; లష్కరే టాప్ లీడర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం  జమ్ముకశ్మీర్
    కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025