NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రచయిత్రి మధుమితా శుక్లా హత్య కేసులో మాజీ మంత్రి దంపతులకు బెయిల్
    తదుపరి వార్తా కథనం
    రచయిత్రి మధుమితా శుక్లా హత్య కేసులో మాజీ మంత్రి దంపతులకు బెయిల్
    మాజీ మంత్రి దంపతులకు బెయిల్

    రచయిత్రి మధుమితా శుక్లా హత్య కేసులో మాజీ మంత్రి దంపతులకు బెయిల్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    ద్వారా సవరించబడింది Sirish Praharaju
    Aug 25, 2023
    02:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌ రచయిత్రి,మధుమితా శుక్లా హత్య కేసులో నిందితుల విడుదలకు సుప్రీం స్టే నిరాకరించింది. ఈ మేరకు 8 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని శుక్రవారం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

    17 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న మాజీ మంత్రి అమరమణి త్రిపాఠి, ఆయన భార్య మధుమణి త్రిపాఠిలను గురువారం రిలీజ్ చేస్తూ యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జైళ్ల శాఖ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

    మధుమితా హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నలుగురు నిందితులకు బెయిల్ లభించింది. అమరమణి, అతని భార్య, మరో ఇద్దరు వ్యక్తులకు 2006లో డెహ్రాడూన్ సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మధుమిత శుక్లా 2003 మే 9న దారుణ హత్యకు గురయ్యారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మాజీ మంత్రి దంపతులకు బెయిల్ మంజూరీ చేసిన యూపీ ప్రభుత్వం 

    Uttar Pradesh Prisons Administration department issued an order for the release of former UP minister Amarmani Tripathi and his wife Madhumani Tripathi, serving life terms in the Madhumita Shukla murder case.

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 25, 2023

    Details 

    బీజేపీకి అవసరం ఉంటే ముఖ్తార్ అన్సారీ సాయం కూడా తీసుకుంటారు: మనోజ్ 

    మాజీ మంత్రి దంపతులను గురువారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే హతురాలు మధుమితా సోదరి నిధి శుక్లా సుప్రీంను ఆశ్రయించారు.

    ఆ నలుగురికి జీవిత ఖైదు పడిందని,వారికి బెయిల్ ను ఇవ్వొద్దని కోరారు. ఈ మేరకు విచారించిన సుప్రీంకోర్టు, స్టే ఇవ్వలేమని వెల్లడించింది.

    మరోవైపు మాజీ మంత్రి అమరమణి విడుదలపై సమాజ్ వాదీ పార్టీ ఖండించింది.ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి కోసమే యోగీ సర్కార్ వారిని విడుదల చేస్తోందని ఆ పార్టీ మండిపడుతోంది.

    యూపీలో యోగీ మోదీ మోడల్ ముగిసిపోయిందని, అందుకే ఎన్నికల కోసం ఇలాంటి వారిని విడుదల చేస్తున్నారని పార్టీ ప్రతినిధి మనోజ్ యాదవ్ ఫైరయ్యారు. వారికి అవసరం ఉంటే 2024 ఎన్నికల్లో ముఖ్తార్ అన్సారీ సాయం కోసం వెనుకాడరని ఎద్దేవా చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    ఉత్తర్‌ప్రదేశ్

    రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం  రెజ్లింగ్
    బ్రిజ్‌ భూషణ్‌ కు యోగి సర్కార్ ఝలక్... ర్యాలీకి నో పర్మిషన్ యోగి ఆదిత్యనాథ్
    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే  రైలు ప్రమాదం
    గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు; అవధేష్ రాయ్ హత్య కేసులో శిక్ష ఖరారు  హత్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025