NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం
    తదుపరి వార్తా కథనం
    మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం

    మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం

    వ్రాసిన వారు Stalin
    Feb 23, 2023
    05:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం ఎంపీ సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నుంచి తనకు ప్రాణహాని ఉందని నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించిన ఒక రోజు తర్వాత, థానే పోలీసులు అతనిపై పరువు నష్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    థానే మాజీ మేయర్ మీన్‌కాషి షిండే ఫిర్యాదు మేరకు థానేలోని కపూర్‌బావడి పోలీసులు సంజయ్ రౌత్‌పై కేసు నమోదు చేశారు.

    ఎంపీ శ్రీకాంత్ షిండేపై రౌత్ చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆమె ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కల్యాణ్ లోక్ సభ నియోజకవర్గానికి శ్రీకాంత్ షిండే ప్రాతినిధ్య వహిస్తున్నారు.

    శివసేన

    సంజయ్ రౌత్‌ ఆరోపణలను ఖండించిన ఫడ్నవీస్

    శ్రీకాంత్ షిండే తనను హత్య చేసేందుకు థానేకు చెందిన రాజా ఠాకూర్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారని సంజయ్ రౌత్‌ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. థానే పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఆ లేఖను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు కూడా పంపారు.

    అయితే రౌత్ ఫిర్యాదుపై స్పందించిన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హామీ విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.

    సంజయ్ రౌత్‌ ఆరోపణలను ఫడ్నవీస్ ఖండించారు. సానుభూతి పొందేందుకు రౌత్ ప్రయత్నిస్తున్నారని, బుద్ధిలేని ఆరోపణలు చేస్తున్నారని ఫడ్నవీస్ అన్నారు.

    రౌత్ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించాలని ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, ఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే కాల్పులు జరిపినా పట్టించుకోలేదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శివసేన
    మహారాష్ట్ర

    తాజా

    RCB vs PBKS : ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. చిత్తుగా ఓడిన పంజాబ్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Jonas Masetti: బ్రెజిల్‌కు చెందిన జొనాస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు.. ఇంతకీ ఎవరీయన ? పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
    #NewsBytesExplainer: మావోయిస్టులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన DRG దళం ప్రాముఖ్యత ఏమిటి? డీఆర్జీ దళాలు
    Virat Kohli: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎందుకని ప్రశ్నించిన హర్భజన్ కూతురు విరాట్ కోహ్లీ

    శివసేన

    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ సుప్రీంకోర్టు
    శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి ఏక్‌నాథ్ షిండే
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి రోడ్డు ప్రమాదం
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025