NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మేజర్ యాంటీ-టెర్రర్ ఆపరేషన్ , కొత్తగా ఏర్పడిన టెర్రర్ గ్రూప్ విచ్ఛిన్నం..! 
    తదుపరి వార్తా కథనం
    Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మేజర్ యాంటీ-టెర్రర్ ఆపరేషన్ , కొత్తగా ఏర్పడిన టెర్రర్ గ్రూప్ విచ్ఛిన్నం..! 
    జమ్ముకశ్మీర్‌లో మేజర్ యాంటీ-టెర్రర్ ఆపరేషన్ , కొత్తగా ఏర్పడిన టెర్రర్ గ్రూప్ విచ్ఛిన్నం..!

    Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మేజర్ యాంటీ-టెర్రర్ ఆపరేషన్ , కొత్తగా ఏర్పడిన టెర్రర్ గ్రూప్ విచ్ఛిన్నం..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 22, 2024
    11:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లో పోలీసులు భారీ యాంటీ టెర్రర్ ఆపరేషన్‌ను చేపట్టారు. వరుసగా నిర్వహించిన సోదాల్లో కొత్తగా ఏర్పాటైన ఉగ్రగ్రూప్ తెహ్రీక్ లబైక్ యా ముస్లీమ్ (TLM)ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

    ఈ గ్రూప్ లష్కరే తోయిబా అనుబంధ శాఖగా ఉంది. దాని కార్యకలాపాలను బాబా హమాస్ అనే పాకిస్థానీ వ్యక్తి పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

    గాందర్‌బల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ఈ భారీ ఎత్తున సోదాలు జరుగుతున్నాయి.

    వివరాలు 

    యువతను భారీగా రిక్రూట్ చేసుకుంటున్నటీఎల్‌ఎం 

    శ్రీనగర్, గాందర్‌బల్, బాందిపొరా, కుల్గామ్, బుడ్గాం, అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాల్లో ఈ సోదాలు జరిగాయి.

    తీవ్రవాద కార్యకలాపాల కోసం టీఎల్‌ఎం గత కొంత కాలంగా యువతను భారీగా రిక్రూట్ చేసుకుంటోందని, ఆ రిక్రూట్‌మెంట్ వ్యవస్థను చెదరగొట్టడమే సోదాల ప్రాథమిక లక్ష్యమని పోలీసులు వెల్లడించారు.

    బాబా హమాస్‌కు అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో బలమైన సంబంధాలు ఉన్నాయి. చొరబాట్లను ప్రోత్సహించడం, ఆర్థిక వనరులను సమకూర్చడం, టీఎల్‌ఎంకు యువతను రిక్రూట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని పేర్కొన్నారు.

    వివారాలు 

    ఉగ్ర ముఠా కోసం గాలింపు

    ఇటీవల సోన్‌మార్గ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో స్థానికేతర కూలీలు మరియు వైద్యుడితో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

    ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, బలగాలు ఆ ఉగ్ర ముఠా కోసం గాలింపు చేపట్టాయి.

    'జాతీయ దర్యాప్తు సంస్థ' (ఎన్‌ఐఏ) అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

    దాడి చేసిన వారు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు, వారు ఆ ప్రాంతాన్ని ముందుగా పరిశీలించారని భావిస్తున్నారు.

    లేదంటే స్థానికులెవరైనా వారికి సహకరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

    కశ్మీర్ గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నా, ఈ ప్రాంతంలో ఇలాంటి హింసాత్మక ఘటన జరగడం ఇదే తొలిసారి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    ఎన్ఐఏ

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    జమ్ముకశ్మీర్

    Jammu: సుంజ్వాన్ ఆర్మీ బేస్ సమీపంలో ఉగ్రదాడి.. జవాన్కు గాయాలు భారతదేశం
    JammuKashmir Elections: బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా  అమిత్ షా
    J&K: జమ్ముకశ్మీర్‌ నౌషేరాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం  భారతదేశం
    Indian Air Force: మహిళా అధికారిపై వింగ్ కమాండర్ అత్యాచారం అత్యాచారం

    ఎన్ఐఏ

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ముంబై
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు కర్ణాటక
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఉగ్రవాదులు
    టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025