NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AIIMS: ఎంబీబీఎస్‌ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
    తదుపరి వార్తా కథనం
    AIIMS: ఎంబీబీఎస్‌ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
    ఎంబీబీఎస్‌ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

    AIIMS: ఎంబీబీఎస్‌ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 17, 2024
    05:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించాలని పిలుపునిచ్చారు.

    గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ (AIIMS) తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

    గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలు స్వాగతం పలికారు.

    ఎయిమ్స్‌ కార్యక్రమానికి చేరుకున్న ముర్ము, మొదటి బ్యాచ్‌గా వైద్య విద్య పూర్తి చేసిన 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు అందజేశారు.

    వివరాలు 

    దేశ సమగ్ర ఆరోగ్య సంరక్షణలో యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలి: ముర్ము  

    ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, వైద్య వృత్తి ద్వారా విద్యార్థులు మానవత్వానికి ప్రాధాన్యమిచ్చే సేవా మార్గాన్ని ఎంచుకున్నారని ప్రశంసించారు.

    ప్రజల ప్రాణాలను కాపాడే, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ వృత్తి ఎంతో విలువైనదని ఆమె అన్నారు.

    యువ వైద్యులు ముఖ్యంగా గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో సేవలందించాలని సూచించారు.

    దేశ సమగ్ర ఆరోగ్య సంరక్షణలో యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలని ఆమె అభిప్రాయపడ్డారు.

    చిత్తశుద్ధితో పని చేస్తూ, దేశ ఆరోగ్యాభివృద్ధికి తోడ్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

    వివరాలు 

    ఎయిమ్స్‌ కోసం అదనంగా 10 ఎకరాల స్థలం 

    మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

    మంగళగిరి ఎయిమ్స్ దేశవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సంస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, ఎయిమ్స్‌ కోసం అదనంగా 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

    ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేశ్, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ద్రౌపది ముర్ము

    తాజా

    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ

    ద్రౌపది ముర్ము

    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు గణతంత్ర దినోత్సవం
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025