NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్‌లో భీకర కాల్పులు.. 8 మంది మృతి, భారీగా పేలుడు పదర్థాలు స్వాధీనం
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్‌లో భీకర కాల్పులు.. 8 మంది మృతి, భారీగా పేలుడు పదర్థాలు స్వాధీనం
    మణిపూర్‌లో మళ్లీ హింసకాండ

    మణిపూర్‌లో భీకర కాల్పులు.. 8 మంది మృతి, భారీగా పేలుడు పదర్థాలు స్వాధీనం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 01, 2023
    12:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్​లో మళ్లీ హింస చెలరేగింది. భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్ల మధ్య భీకర ఎన్​కౌంటర్లో జరిగింది. ఘటనలో​ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది.

    బిష్ణుపూర్, చురచంద్‌పూర్ జిల్లాల్లో ఆగస్ట్ 29 నుంచి కాల్పుల మోత మోగుతోంది. రెండు తెగల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం అట్టుడికిపోతోంది.

    ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం భద్రతా బలగాలు, కుకీ అతివాదులకు మధ్య ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది.

    బిష్ణుపూర్ జిల్లాలోని తమనాపోక్పి వద్ద జరిగిన ఘటనలో 8 మంది మరణించారు. మరో 18 మందికిపైగా గాయాలపాలయ్యారు.

    మృతుల్లో ఆరుగురు కుకీ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఇద్దరు భద్రతా బలగాలకు చెందిన సిబ్బంది ఉన్నారు.

    DETAILS

    ఆగస్ట్ 31న చురచంద్‌పూర్‌లోని పలు ప్రాంతాలు పూర్తి బంద్‌

    మరోవైపు దోపిడీకి గురైన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు మణిపూర్ పోలీసులు, కేంద్ర భద్రతా దళాల బృందాలు గాలిస్తున్నాయి.

    ఇదిలా ఉండగా, ఆగస్ట్ 31న చురచంద్‌పూర్‌లోని ప్రాంతాలు పూర్తి బంద్‌ పాటించాయి.

    గడిచిన 24 గంటల్లో సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. కాంగ్‌పోక్పి, తౌబాల్, చురచంద్‌పూర్.ఇంఫాల్ పశ్చిమ జిల్లాల్లోని పలు ప్రాంతాలలో పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది.

    ఆయా ప్రాంతాల్లో భద్రతా బలగాలు దాడులు నిర్వస్తోంది.ఈ మేరకు ఐదు ఆధునిక ఆయుధాలు సహా 31 రౌండ్ల మందుగుండు సామగ్రి, 19 పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

    గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు ఎదుర్కోలేదని అస్సామ్ రైఫిల్స్ డీజీ పీసీ నాయర్ ఆందోళన వ్యక్తం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదు: డీజీ వీసీ నాయర్ 

    #WATCH | Shillong, Meghalaya | Lt. General PC Nair, Director General of Assam Rifles says "The situation that we are facing in Manipur is unprecedented. We have never faced anything of this kind. Something similar happened in the early 90s when the Nagas and Kukis fought and then… pic.twitter.com/zNBHUeYBVT

    — ANI (@ANI) September 1, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    మణిపూర్

    ప్రధాని మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. హింసకు పోలీసులూ కారణమేనట  నరేంద్ర మోదీ
    NDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మణిపూర్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 718మంది మయన్మార్ పౌరులు  మయన్మార్
    మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన: రాత్రింతా ప్రతిపక్ష ఎంపీలు నిరసన  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025