
Nimisha Priya: 'సున్నితమైన విషయం,ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తోంది': నిమిష ప్రియ మరణశిక్షపై స్పందించిన భారతీయ విదేశాంగ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు ఎంతో సున్నితమైన అంశమని, ఆమెను మరణశిక్ష నుంచి తప్పించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయం అందిస్తోందని కేంద్ర విదేశాంగశాఖ స్పష్టంచింది. యెమెన్ దేశస్థుడైన వ్యక్తిని హత్య చేసిన కేసులో ఆమెకు ఆ దేశ ప్రభుత్వం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ నెల 16వ తేదీన నిమిష ప్రియను ఉరి తీయాల్సి ఉంది. అయితే యెమెన్ ప్రభుత్వం ఆ శిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఈ రోజు స్పందిస్తూ,నిమిష ప్రియ కేసు పరిష్కారం కోసం కొన్ని స్నేహపూర్వక దేశాలతో సంపర్కంలో ఉన్నామని తెలిపింది.
వివరాలు
షరియా చట్టం ప్రకారం ప్రతీకార న్యాయం(కిసాస్) కావాలన్నడిమాండ్
ఈఅంశాన్ని దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నట్లు,నిమిష ప్రియకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొంది. ఈసమస్యను పరిష్కరించేందుకు అక్కడ ఉన్న స్థానిక అధికారులతో నిరంతరం సంబంధం కల్పించుకుంటున్నామని కూడా విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇదిలాఉండగా,తలాల్ అబ్దో మెహదీ అనే యెమెన్ వ్యక్తిని 2017లో హత్య చేసిన నిమిష ప్రియకు క్షమాభిక్ష మంజూరు చేయాలని లేదా నష్టపరిహారం(బ్లడ్ మనీ)తీసుకోవాలని వస్తున్న ప్రతిపాదనలను తమ కుటుంబం తిరస్కరిస్తుందని బాధితుడి సోదరుడు అబ్దెల్ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు. షరియాచట్టాల ప్రకారం న్యాయం కావాలని,తమకు న్యాయం దక్కాలంటే కిసాస్(ప్రతీకార న్యాయం) తప్పదని మరోసారి తన డిమాండ్ను స్పష్టంచేశారు. నిమిషా ప్రియాచేసిన నేరానికి తగిన శిక్ష అనేవే ఉరి శిక్ష అని తేల్చి చెప్పారు.