Page Loader
Andhrapradesh: ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజులపాటు భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ..
ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజులపాటు భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ..

Andhrapradesh: ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజులపాటు భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 27, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

వాయువ్య బంగాళాఖాతం తీరాన్ని ఆనుకొని ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఓ అల్పపీడన పరిస్థితి ఏర్పడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ ప్రాంతాలపైగా ప్రయాణించే అవకాశముందని పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రవేశానంతరం బంగాళాఖాతంలో ఏర్పడిన ఇదే తొలి అల్పపీడనంగా పేర్కొంది. ఈ అల్పపీడనంతో పాటు గత రెండు రోజులుగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో తక్కువ నుండి ఎక్కువ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వివరాలు 

గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు

ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వానల సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇవాళ్టి నుండి నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున, నీటి మిగులే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వివరాలు 

ఈ ప్రాంతాలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు

ఈ అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రోజున రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

వివరాలు 

29వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ఇటివల నైరుతి రుతుపవనాల విస్తరణ నెమ్మదిగా సాగినప్పటికీ, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షపాతం మళ్లీ ఊపందుకుంది. వచ్చే మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముండగా, ఆ తర్వాత కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేగాక, ఈ నెల 29వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని పేర్కొంది.