NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tahawwur Rana: తహవ్వుర్‌ రాణా కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించిన కేంద్రం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Tahawwur Rana: తహవ్వుర్‌ రాణా కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించిన కేంద్రం 
    తహవ్వుర్‌ రాణా కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించిన కేంద్రం

    Tahawwur Rana: తహవ్వుర్‌ రాణా కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించిన కేంద్రం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 10, 2025
    10:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2008 ముంబయి ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి తహవ్వుర్‌ రాణా ను భారతదేశానికి తరలిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    ఈ కేసును వాదించేందుకు నరేందర్ మాన్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

    అతను మూడు సంవత్సరాల పాటు లేదా ట్రయల్ ముగిసేంతవరకూ.. ఏది ముందుగా జరిగితే అది.. దిల్లీలోని ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక న్యాయస్థానాల్లో, అప్పీల్ కోర్టుల్లో ఎన్‌ఐఏ తరఫున వాదనలు వినిపించనున్నాడు.

    వివరాలు 

     తిహాడ్‌ జైలుకు తహవ్వుర్‌ రాణా

    తహవ్వుర్‌ రాణా పాకిస్థాన్ కు చెందినవాడు, కాని కెనడా పౌరసత్వం కలిగి ఉన్నాడు.

    అతను 26/11 ముంబయి ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని అనుమానంతో 2009లో అరెస్ట్ అయ్యాడు.

    అప్పటి నుంచి అమెరికాలో శిక్ష అనుభవిస్తున్న రాణాను ప్రస్తుతం భారత్‌కు అప్పగింత ప్రక్రియలో భాగంగా తీసుకువస్తున్నారు.

    బుధవారం రాత్రి 7:10 గంటలకు అతన్ని తీసుకొచ్చే ప్రత్యేక విమానం ఇండియాకు బయలుదేరింది.

    గురువారం మధ్యాహ్నానికి ఆ విమానం భారత్‌కు చేరుకోనుంది. దేశానికి వచ్చిన వెంటనే ఎన్‌ఐఏ అధికారులు అతన్ని అధికారికంగా అరెస్ట్ చేసి, దిల్లీలోని తిహాడ్‌ జైలుకు తరలించనున్నారు.

    జైలు నంబర్ 2లో అతనిని ఉంచే అవకాశం ఉంది.

    వివరాలు 

     అజ్మల్ కసబ్‌కు జైల్లో బిర్యానీ 

    ఇక 26/11 ఘటనపై స్పందించిన ముంబయిలో చాయ్‌ వాలాగా పని చేసే మహ్మద్ తౌఫిక్ మాట్లాడుతూ.. రాణాకు జైల్లో ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు, ముఖ్యంగా బిర్యానీ వంటివి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.

    అప్పట్లో అదే దాడిలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు జైల్లో బిర్యానీ ఇచ్చారని వార్తలు వచ్చాయని గుర్తు చేశారు.

    కసబ్‌కు భారత ప్రభుత్వం 2012 నవంబర్ 21న ఉరిశిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే.

    వివరాలు 

    ముంబయిలో దాడులు 

    2008 నవంబర్ 26న సముద్ర మార్గం ద్వారా 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు ముంబయిలోకి ప్రవేశించి, సీఎస్‌ఎంటీ స్టేషన్‌, తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ వంటి ప్రదేశాల్లో దాడులకు పాల్పడ్డారు.

    ఈ మారణకాండ నవంబర్ 29 వరకు కొనసాగింది. మొత్తం 166 మంది మృతి చెందగా, వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.

    ఈ ఉగ్రదాడిలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్ వంటి అత్యుత్తమ అధికారి అమరులయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు బెంగళూరు
    Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @25,000  స్టాక్ మార్కెట్

    కేంద్ర ప్రభుత్వం

    India-US: భారత్‌,అమెరికా భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసే దురుద్దేశంతో కొన్ని శక్తులు పని చేస్తున్నాయి.. కేంద్రానికి నివేదిక అంతర్జాతీయం
    Vizag Steel: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ.. కేంద్రం అధికారిక ప్రకటన విశాఖపట్టణం
    #NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? దిల్లీ
    Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్ విదేశాంగశాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025