NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mudragada: ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక రాజకీయాల్లోకి కాపు ఉద్యమ నేత 
    తదుపరి వార్తా కథనం
    Mudragada: ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక రాజకీయాల్లోకి కాపు ఉద్యమ నేత 
    Mudragada: ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక రాజకీయాల్లోకి కాపు ఉద్యమ నేత

    Mudragada: ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక రాజకీయాల్లోకి కాపు ఉద్యమ నేత 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 11, 2024
    02:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో చాలామంది నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

    వైసీపీ,టీడీపీలో ఇప్పటికే వలసలు మొదలయ్యాయి.

    కాపు రిజర్వేషన్లపై కాపు ఉద్యమనేత,సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో తన గళంవినిపిస్తున్నారు.

    అయితే ముద్రగడ పద్మనాభం జనసేన ద్వారా కాకినాడ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.ఈ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

    కాపులపై పవన్ కళ్యాణ్ ఇటీవలి వైఖరికి మద్దతు తెలిపిన ఆయన కాపు రిజర్వేషన్ల కోసం ఇటీవల జరిగిన నిరసనలతో తగినంత మైలేజ్ సంపాదించారు.

    ముద్రగడ తన రాజకీయ భవిష్యత్తుపై తన సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం.

    పవన్ కళ్యాణ్ తో కలిసి నడవాలని ఆయన సన్నిహితులంతా కోరుకుంటున్నారు.

    Details 

    ముద్రగడ ఇంటికి బొలిశెట్టి,జ్యోతుల నెహ్రూ

    ఈ నేపథ్యంలో బుధవారం ముద్రగడతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్‌ చర్చలు జరిపారు.

    జనసేన నేతలతో భేటీపై ముద్రగడ పద్మనాభం మౌనం వహించినా మరికొద్ది రోజుల్లో జనసేన అధినేత స్వయంగా ముద్రగడ ఇంటికి వచ్చి జేఎస్పీ-టీడీపీ కూటమిలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం.

    గురువారం ఉదయం ముద్రగడ ఇంటికి టీడీపీ సీనియర్ నేత టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వచ్చి చర్చలు జరిపారని, తమ పార్టీలో చేరాల్సిందిగా ఆయనను అధికారికంగా ఆహ్వానించారని కొత్త కథనాలు చెబుతున్నాయి.

    Details 

    ముద్రగడ కుమారుడు గిరిబాబు  క్లారిటీ 

    ముద్రగడ భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీలో చేరతారనే దానిపై ముద్రగడ కుటుంబం క్లారిటీ ఇవ్వలేదు.

    ఈ తరుణంలో ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి బాబు పద్మనాభం టీడీపీ, జనసేన ఏ పార్టీలోకి అయినా వెళ్లే అవకాశం ఉందంటూ క్లారిటీ ఇచ్చారు.

    తండ్రితో పాటు తాను కూడా పోటీ చేస్తానని చెపారు. జనసేన, టీడీపీల్లో చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే దానిపై ముద్రగడ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    Sri Sathya Sai: పుట్టపర్తిలో అద్భుత దృశ్యం.. శ్రీ సత్యసాయి మెడలో నాగుపాము   శ్రీ సత్యసాయి జిల్లా
    AP Exams Schedule : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల బొత్స సత్యనారాయణ
    Ap Uranium: యురేనియంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..ఆ 4 ఏపీ జిల్లాల్లో అన్వేషణ కేంద్రమంత్రి
    Ap Cabinet : ఏపీలో పెన్షన్ రూ.3వేలకు పెంపు, 45 కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025