NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hindi language row: ప్రధానిమోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ.. స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి 
    తదుపరి వార్తా కథనం
    Hindi language row: ప్రధానిమోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ.. స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి 
    ప్రధానిమోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ.. స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి

    Hindi language row: ప్రధానిమోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ.. స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 21, 2025
    03:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం ఎటువంటి భాషను బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు.

    విదేశీ భాషలపై అధికంగా ఆధారపడటం వల్ల విద్యార్థులు స్థానిక భాషల మూలాలను పూర్తిగా అర్థం చేసుకోలేరని అన్నారు.

    జాతీయ విద్యా విధానం(NEP)ద్వారా ఈ పరిస్థితిని సరిచేసే ప్రయత్నం కొనసాగుతోందని మంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

    ప్రధాని నరేంద్ర మోదీ గతంలో తమిళ భాష శాశ్వతమని చేసిన ప్రకటనను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, తమిళ సంస్కృతి, భాషను విశ్వవ్యాప్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

    విద్యను రాజకీయాలకు వేదికగా మార్చకూడదని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

    వివరాలు 

    రూ.2,152 కోట్లను తక్షణమే విడుదల చేయాలి: స్టాలిన్ 

    సమగ్ర శిక్షా పథకం కింద తమిళనాడుకు రూ.2,152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

    జాతీయ విద్యా విధానం-2020ను పూర్తిగా అమలు చేయకపోతే,త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు ఈ నిధులను ఇవ్వబోమని ఇటీవల కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రకటించారని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.

    ఈ నిర్ణయం రాష్ట్రంలోని విద్యార్థులు,ప్రజలు,రాజకీయ పార్టీలు మధ్య తీవ్ర అసంతృప్తి,ఆవేదనను రేకెత్తించిందని తెలిపారు.

    సమగ్ర శిక్షా పథకం కింద నిధులు విడుదల చేయకపోతే, ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వడం, విద్యార్థులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టమవుతుందని స్టాలిన్ హెచ్చరించారు.

    2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రావాల్సిన రూ.2,152 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ధర్మేంద్ర ప్రధాన్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ధర్మేంద్ర ప్రధాన్

    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేంద్రమంత్రి
    కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఏడాదికి రెండు బోర్డ్ ఎగ్జామ్స్  విద్యా శాఖ మంత్రి
    Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025