NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / New ROR 2024 Bill: నేడు సభలో ఆర్వోఆర్‌-2024 బిల్లు.. పట్టాలెక్కనున్న కొత్త చట్టం
    తదుపరి వార్తా కథనం
    New ROR 2024 Bill: నేడు సభలో ఆర్వోఆర్‌-2024 బిల్లు.. పట్టాలెక్కనున్న కొత్త చట్టం
    నేడు సభలో ఆర్వోఆర్‌-2024 బిల్లు.. పట్టాలెక్కనున్న కొత్త చట్టం

    New ROR 2024 Bill: నేడు సభలో ఆర్వోఆర్‌-2024 బిల్లు.. పట్టాలెక్కనున్న కొత్త చట్టం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 18, 2024
    08:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతోంది.

    భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టం-2024 పేరిట బుధవారం శాసనసభలో ఈ బిల్లును రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టనున్నారు.

    ఈ కొత్త చట్టం అమల్లోకి రావడంతో, ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్వోఆర్‌-2020ను రద్దు చేస్తారు.

    కొత్త చట్టంలో పట్టా భూముల యజమానుల హక్కుల సంరక్షణతో పాటు ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక భద్రతా నిబంధనలు చేర్చారు.

    అందులో భాగంగా, ధరణి పోర్టల్‌ పేరును భూమాతగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    వివరాలు 

    పాత సమస్యల పరిష్కారానికి కొత్త దారి 

    2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకకాల రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌ సేవలు అమలు చేయడంలో భాగంగా తెలంగాణ పట్టా పాసుపుస్తకాలు, భూ దస్త్రాల చట్టం, ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది.

    అయితే, వాటి అమలులో అనేక సమస్యలు తలెత్తడంతో, ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను పునరుద్ధరించేందుకు కొత్త చట్టాన్ని ప్రవేశపెడుతున్నారు.

    ఈ చట్టం ద్వారా భూ సమస్యలను తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్‌ స్థాయిలోనే పరిష్కరించుకునే అవకాశం కల్పించబడుతోంది.

    అదనంగా, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

    వివరాలు 

    ధరణి కమిటీ - ప్రజాభిప్రాయ సేకరణ 

    రాష్ట్రంలో భూ సమస్యలపై సమగ్ర అధ్యయనానికి, ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

    ఈ కమిటీ రైతులు, నిపుణులు, రెవెన్యూ సంఘాలు, వక్ఫ్, దేవాదాయ, అటవీ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించింది.

    రంగారెడ్డి జిల్లాలో పర్యటించి భూ సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.

    ఈ నివేదిక ఆధారంగా రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాల్లో పైలట్‌ సర్వే చేపట్టి కీలక అంశాలను గుర్తించారు.

    ఆపై నిపుణుల ద్వారా ఆర్వోఆర్‌ చట్ట రూపకల్పన చేపట్టారు.

    వివరాలు 

    కొత్త చట్టంలోని ముఖ్యాంశాలు 

    అప్పీళ్లకు 60 రోజులు: భూ దస్త్రాల్లో అభ్యంతరాలపై తహసీల్దారు లేదా ఆర్డీవో జారీ చేసే ఉత్తర్వులపై 60 రోజుల్లో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

    ఆబాదీకి హక్కులు: గ్రామ కంఠం భూములకు యాజమాన్య హక్కులు ఇచ్చి, వ్యవసాయేతర భూముల మ్యుటేషన్‌కు వీలు కల్పిస్తారు.

    వారసత్వ బదిలీ విధానం: కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసిన తర్వాత మాత్రమే వారసత్వ బదిలీ ప్రక్రియ చేపడతారు.

    మ్యుటేషన్‌ పటానికి సర్వే: భూమి మ్యుటేషన్‌ చేసేటప్పుడు దరఖాస్తులోనే సర్వే పటం జత చేయడం తప్పనిసరి.

    భూధార్‌: భూములకు ప్రత్యేకంగా భూధార్‌ సంఖ్యలు కేటాయించి, జియోగ్రాఫికల్‌ లొకేషన్‌ ఆధారంగా భూహద్దులను నిర్ధారిస్తారు.

    వివరాలు 

    కొత్త చట్టంలోని ముఖ్యాంశాలు 

    సుమోటో సమీక్ష: భూములకు సంబంధించి సక్రమం కాని రికార్డులపై ప్రభుత్వానికి సమీక్షాధికారం ఉంటుంది.

    క్రిమినల్‌ చర్యలు: ప్రభుత్వ భూములపై అక్రమ పాసుపుస్తకాలు జారీ చేస్తే, వాటిని రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు కల్పిస్తారు.

    అవసరమైతే, సంబంధిత అధికారులను విధుల నుంచి తొలగించి, వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారు.

    ఈ కొత్త చట్టంతో భూ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి, భూ యాజమాన్య హక్కులను మరింత కచ్చితంగా నిర్ధారించవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    తెలంగాణ

    Telangana: అమృత్‌ పథకం కింద తెలంగాణలో రూ.1,663 కోట్ల పనులు: మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ భారతదేశం
    Earthquakes:తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన స్వల్ప భూప్రకంపనలు  భూకంపం
    Regional Ring Road: రీజినల్ రింగ్ రోడ్డుకి 72.35 హెక్టార్ల అప్పగింతకు కేంద్రం ఆమోదం భారతదేశం
    Telangana: యాసంగికి 365 టీఎంసీల కేటాయింపు.. నీటిపారుదల శాఖ నిర్ణయం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025