NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maha Kumbh Mela: మళ్ళీ వచ్చే మహా కుంభమేళాకి నీరు ఉండకపోవచ్చు.. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్​ వాంగ్​ చుక్
    తదుపరి వార్తా కథనం
    Maha Kumbh Mela: మళ్ళీ వచ్చే మహా కుంభమేళాకి నీరు ఉండకపోవచ్చు.. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్​ వాంగ్​ చుక్
    మళ్ళీ వచ్చే మహా కుంభమేళాకి నీరు ఉండకపోవచ్చు.. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్​ వాంగ్​ చుక్

    Maha Kumbh Mela: మళ్ళీ వచ్చే మహా కుంభమేళాకి నీరు ఉండకపోవచ్చు.. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్​ వాంగ్​ చుక్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 26, 2025
    01:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ మహాకుంభమేళా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు.

    144సంవత్సరాల తర్వాత జరిగే మహా కుంభమేళా భూమిపై కాకుండా ఇసుక మీద జరగాల్సి వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

    దీనికి ప్రధాన కారణం నదులు ఎండిపోవడమేనని స్పష్టం చేశారు.

    భారతదేశంలోని అనేక నదులకు మూలమైన హిమాలయ హిమానీనదాలు వేగంగా కరుగుతున్నాయి అనే విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాంగ్‌చుక్ ఈ లేఖ రాశారు.

    హిమానీనదాలను పరిరక్షించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    మహా కుంభమేళాకు పునాదైన గంగా,యమునా వంటి పవిత్ర నదులు హిమాలయాల నుంచి పుట్టుకొస్తాయి.

    అందుకే,హిమానీనదాల పరిరక్షణపై భారత్ ముందడుగు వేయాలని ఆయన సూచించారు.

    వివరాలు 

    హిమానీనదాల స్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక కమిషన్

    లద్దాఖ్‌కు చెందిన పర్యావరణవేత్త అయిన వాంగ్‌చుక్ ప్రధాని మోదీ చేపట్టిన పర్యావరణ కార్యక్రమాలను ప్రశంసించడంతో పాటు హిమానీనదాల స్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

    హిమానీనదాలు వేగంగా కరుగిపోతున్నాయి. అదే రీతిలో అడవుల నరికివేత కొనసాగితే, వచ్చే కొన్ని దశాబ్దాల్లో గంగా, బ్రహ్మపుత్ర, సింధు వంటి నదులు కాలానుగుణంగా ప్రవహించే స్థితికి చేరుకోవచ్చు.

    దీని అర్థం 144 ఏళ్ల తర్వాత జరగబోయే మహాకుంభమేళా పవిత్ర నదులపై కాకుండా, ఇసుక నేల మీద జరగాల్సి రావచ్చు అని ఆయన హెచ్చరించారు.

    వివరాలు 

    నేటితో ముగియనున్న మహాకుంభమేళా

    ఈ విషయంపై ప్రజల్లో అవగాహన చాలా తక్కువగా ఉందని వాంగ్‌చుక్ ఆవేదన వ్యక్తం చేశారు.

    లద్దాఖ్ ప్రాంత ప్రజలు హిమానీనదాల కరుగుదలను ప్రతిబింబించే మంచు గడ్డను తీసుకువచ్చి ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.

    వారి కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానికి వాంగ్‌చుక్ విజ్ఞప్తి చేశారు.

    ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని 'అంతర్జాతీయ హిమానీనదాల పరిరక్షణ సంవత్సరం'గా ప్రకటించింది.

    గత కొన్నేళ్లుగా పర్యావరణ మార్పుల ప్రభావాన్ని దేశం దృష్టికి తీసుకురావడానికి వాంగ్‌చుక్ నిరంతర పోరాటం చేస్తున్నారు.

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమునా, పురాణ సరస్వతి నదుల సంగమం వద్ద జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా నేటితో ముగుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహాకుంభమేళా

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    మహాకుంభమేళా

    Sangam Nose:'సంగం నోస్‌' ఏమిటీ ?.. అసలు ఈ ఘాట్‌ విశేషాలు ఏంటీ? సంగం నోస్‌
    Maha Kumbhamela: మహాకుంభమేళా మరోసారి అగ్ని ప్రమాదం భారతదేశం
    PM Modi: మహా కుంభమేళాను సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం నరేంద్ర మోదీ
    Maha Kumbhamela: 'ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్': 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న మహా కుంభమేళా యాత్రికులు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025