Maha Kumbh Mela: మళ్ళీ వచ్చే మహా కుంభమేళాకి నీరు ఉండకపోవచ్చు.. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ మహాకుంభమేళా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు.
144సంవత్సరాల తర్వాత జరిగే మహా కుంభమేళా భూమిపై కాకుండా ఇసుక మీద జరగాల్సి వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
దీనికి ప్రధాన కారణం నదులు ఎండిపోవడమేనని స్పష్టం చేశారు.
భారతదేశంలోని అనేక నదులకు మూలమైన హిమాలయ హిమానీనదాలు వేగంగా కరుగుతున్నాయి అనే విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాంగ్చుక్ ఈ లేఖ రాశారు.
హిమానీనదాలను పరిరక్షించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మహా కుంభమేళాకు పునాదైన గంగా,యమునా వంటి పవిత్ర నదులు హిమాలయాల నుంచి పుట్టుకొస్తాయి.
అందుకే,హిమానీనదాల పరిరక్షణపై భారత్ ముందడుగు వేయాలని ఆయన సూచించారు.
వివరాలు
హిమానీనదాల స్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక కమిషన్
లద్దాఖ్కు చెందిన పర్యావరణవేత్త అయిన వాంగ్చుక్ ప్రధాని మోదీ చేపట్టిన పర్యావరణ కార్యక్రమాలను ప్రశంసించడంతో పాటు హిమానీనదాల స్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
హిమానీనదాలు వేగంగా కరుగిపోతున్నాయి. అదే రీతిలో అడవుల నరికివేత కొనసాగితే, వచ్చే కొన్ని దశాబ్దాల్లో గంగా, బ్రహ్మపుత్ర, సింధు వంటి నదులు కాలానుగుణంగా ప్రవహించే స్థితికి చేరుకోవచ్చు.
దీని అర్థం 144 ఏళ్ల తర్వాత జరగబోయే మహాకుంభమేళా పవిత్ర నదులపై కాకుండా, ఇసుక నేల మీద జరగాల్సి రావచ్చు అని ఆయన హెచ్చరించారు.
వివరాలు
నేటితో ముగియనున్న మహాకుంభమేళా
ఈ విషయంపై ప్రజల్లో అవగాహన చాలా తక్కువగా ఉందని వాంగ్చుక్ ఆవేదన వ్యక్తం చేశారు.
లద్దాఖ్ ప్రాంత ప్రజలు హిమానీనదాల కరుగుదలను ప్రతిబింబించే మంచు గడ్డను తీసుకువచ్చి ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.
వారి కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానికి వాంగ్చుక్ విజ్ఞప్తి చేశారు.
ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని 'అంతర్జాతీయ హిమానీనదాల పరిరక్షణ సంవత్సరం'గా ప్రకటించింది.
గత కొన్నేళ్లుగా పర్యావరణ మార్పుల ప్రభావాన్ని దేశం దృష్టికి తీసుకురావడానికి వాంగ్చుక్ నిరంతర పోరాటం చేస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగ, యమునా, పురాణ సరస్వతి నదుల సంగమం వద్ద జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా నేటితో ముగుస్తోంది.