NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NITI Aayog: నేడు దిల్లీలో మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ
    తదుపరి వార్తా కథనం
    NITI Aayog: నేడు దిల్లీలో మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ
    నేడు దిల్లీలో మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ

    NITI Aayog: నేడు దిల్లీలో మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 24, 2025
    08:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం దిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరుగనుంది.

    ఉదయం 9 గంటలకు 'వికసిత్ రాజ్య, వికసిత్ భారత్-2047' అనే ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని ఈ సమావేశం జరగనుంది.

    స్వాతంత్య్రం 100 ఏళ్లకు, అంటే 2047 నాటికి భారత్‌ను పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సమావేశంలో విస్తృతంగా చర్చలు నిర్వహించనున్నారు.

    ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, పూర్తికాలపు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యే అవకాశం ఉంది.

    కేంద్ర ప్రభుత్వ నూతన పథకాల రూపకల్పన, అమలులో రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ సమావేశం కీలకంగా మారనుంది.

    Details

    రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం 

    ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరిగే ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు — ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

    ప్రత్యేకించి, ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ తరువాత తొలిసారి పాలక మండలి భేటీ కావడం ఈ సమావేశానికి ప్రాధాన్యతను కల్పిస్తోంది.

    సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తూ, జాతీయ దృష్టికోణానికి రాష్ట్రాల ఆకాంక్షలను అనుసంధానించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశంగా ఉంది.

    వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రాల భాగస్వామ్యంతో కలిసికట్టుగా కార్యాచరణ రూపురేఖలు రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు.

    2047 నాటికి భారత్‌ను శక్తివంతమైన అభివృద్ధి చెందిన దేశంగా మలచేందుకు ఈ సమావేశం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    దిల్లీ

    తాజా

    NITI Aayog: నేడు దిల్లీలో మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ నరేంద్ర మోదీ
    Donald Trump: ఆపిల్ సహా విదేశీ ఫోన్లపై ట్రంప్ భారీ సుంకాల ప్రకటన అమెరికా
    Monsoon: నేడు కేరళలోకి రుతుపవనాల ప్రవేశం.. దేశవ్యాప్తంగా వర్ష సూచన నైరుతి రుతుపవనాలు
    Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే హైదరాబాద్

    నరేంద్ర మోదీ

    PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ భారతదేశం
    PM Modi: 'రక్తం మరుగుతోంది'.. ఉగ్రవాదులకు శిక్ష తప్పదు : నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్
    Modi-Rajnath Singh: పహల్గాం దాడి.. భద్రతా అంశాలపై ప్రధానితో రాజ్‌నాథ్‌ కీలక సమావేశం  రాజ్‌నాథ్ సింగ్
    PM Modi: సీడీఎస్‌, రక్షణమంత్రి, ఎన్‌ఎస్‌ఏలతో ప్రధాని మోదీ కీలక సమావేశం  భారతదేశం

    దిల్లీ

    Delhi CM: దిల్లీ మహిళలకు భారీ గిఫ్ట్.. బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన  బీజేపీ
    British Woman: సోషల్‌ మీడియాలో పరిచయం.. స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన బ్రిటిష్ మహిళ  అత్యాచారం
    Delhi Airport: కేంద్రంపై దిల్లీ విమానాశ్రయం దావా.. హిండన్ ఎయిర్‌బేస్ వివాదం! కేంద్ర ప్రభుత్వం
    Bill Gates: భారత పార్లమెంట్‌ను సందర్శించిన బిల్ గేట్స్.. జేపీ నడ్డాతో కీలక చర్చలు బిల్ గేట్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025