
No funds-puri MP candidate-Sucharitha Mohanthy: డబ్బుల్లేవు ....పోటీ చేయలేనని ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుచరిత మహంతి
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశా (Odisha)లోని పూరి (Puri) లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ (Congress) అభ్యర్థి సుచరిత మహంతి (Sucharitha Mohanthi) పోటీ నుంచి వైదొలిగారు. ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు కూడా తన వద్ద డబ్బుల్లేవని అందుకే పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు. పార్టీ నుంచి తగినంత నిధులు ఇవ్వలేదని పేర్కొంటూ ఆమె టికెట్ను తిరిగి ఇచ్చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ప్రజావిరాళాలను సేకరించినప్పటికీ కొంతమొత్తంలో మాత్రమే అవి ప్రచారానికి ఉపయోగపడ్డాయని ఫలితంగా ప్రభావంతంగా తను ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించలేకోపోయానని తెలిపారు.
No funds-puri MP candidate
లేఖ రాసిన సుచరిత మహంతి
పార్టీ నుంచి తనకు నిధులు కేటాయించేందుకు నిరాకరించారని అవతలి పార్టీలైన బీజేపీ, బీజేడీలు ఎన్నికల ప్రచారం లో కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు మే 3 న లేఖరాశారు.