NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భగ్గుమంటున్న ఈశాన్య రాష్ట్రం.. మరికాసేపట్లో మణిపూర్ సీఎం బీరేన్‌ సింగ్ రాజీనామా?
    తదుపరి వార్తా కథనం
    భగ్గుమంటున్న ఈశాన్య రాష్ట్రం.. మరికాసేపట్లో మణిపూర్ సీఎం బీరేన్‌ సింగ్ రాజీనామా?
    నేడు మణిపూర్ సీఎం బీరేన్‌ సింగ్ రాజీనామా?

    భగ్గుమంటున్న ఈశాన్య రాష్ట్రం.. మరికాసేపట్లో మణిపూర్ సీఎం బీరేన్‌ సింగ్ రాజీనామా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 30, 2023
    02:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతుండటంతో ఇప్పటికే వందమందికి పైగా మరణించారు. శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం బీరేస్ సింగ్ తన పదవికి మరికాసేపట్లో రాజీనామా చేసే అవకాశం ఉంది.

    శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మణిపూర్ గవర్నర్ అనసూయ యూకీని కలిసి, సీఎం రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని తెలిసింది.

    బీరన్‌సింగ్ రాజీనామా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్డడం వంటి రెండు ఆప్షన్లే సీఎం ముందు ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాజ్ భవన్ బయట మహిళలు బీరెన్ సింగ్ రాజీనామా చేయవద్దని నినాదాలు చేశారు.

    మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు ఈనెల 23న కేంద్ర హోమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యారు.

    Details

    మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలో వందమంది మ‌ృతి

    మణిపూర్ లో జరిగిన ఘటనపై అమిత్ షాతో జరిగిన సమావేశంలో చర్చించానని సీఎం బిరెన్ సింగ్ తెలిపారు.

    గత కొన్ని రోజులగా మైతీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. మరోపక్క రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి.

    మొదట్లో మే 3వ తేదీన కొండ జిల్లాలో నిర్వహించిన గిరిజన సంఘీభావ యాత్ర వల్ల ఈ హింస చెలరేగింది. మణిపూర్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటీవలే మైతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా ఇచ్చింది.

    అయితే నాగా, కుకీ సామాజిక వర్గాలకు చెందిన వారు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మణిపూర్ జరిగిన అల్లర్ల కారణంగా ఇప్పటికే వందమందికి పైగా మరణించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    ముఖ్యమంత్రి

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    మణిపూర్

    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  తాజా వార్తలు
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి? ఆర్మీ
    మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా  తాజా వార్తలు
    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు  తాజా వార్తలు

    ముఖ్యమంత్రి

    ఒంట్టిమిట్ట సీతా‌రాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్
    ఈదురు గాలులకు కూలిన భారీ చెట్టు; ఏడుగురు మృతి మహారాష్ట్ర
    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025