NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ajit Doval: భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు.. చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్‌పై అజిత్ దోవల్ దృష్టి
    తదుపరి వార్తా కథనం
    Ajit Doval: భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు.. చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్‌పై అజిత్ దోవల్ దృష్టి
    భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు

    Ajit Doval: భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు.. చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్‌పై అజిత్ దోవల్ దృష్టి

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 19, 2025
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ సోమవారం ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి డాక్టర్ అలీ అక్బర్ అహ్మదియాన్‌తో టెలిఫోన్ ద్వారా కీలకమైన చర్చలు నిర్వహించారు.

    ఈ సంభాషణలో ప్రధానంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేయడం, ముఖ్యంగా చాబహార్ పోర్టు అభివృద్ధి,అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (ఐఎన్‌ఎస్‌టీసీ) వంటి ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించినట్లు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

    ఈ సందర్భంగా అజిత్ దోవల్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఇరాన్‌ తీసుకుంటున్న నిర్మాణాత్మక వైఖరిని ప్రశంసించారు.

    చాబహార్ పోర్టు అభివృద్ధి,ఐఎన్‌ఎస్‌టీసీ ప్రాజెక్టును ముందుకు నడిపే విషయంలో భారత్‌కు గాఢమైన ఆసక్తి ఉందని అహ్మదియాన్‌కు తెలియజేశారు.

    వివరాలు 

    చాబహార్ పోర్టు.. వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకునే ప్రత్యామ్నాయ మార్గం 

    ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించేందుకు భారత్ యత్నిస్తోందని కూడా వివరించారు.

    భారతదేశానికి వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా చాబహార్ పోర్టు, ఐఎన్‌ఎస్‌టీసీ ప్రాజెక్టులు ఎంతో కీలకంగా ఉన్నాయి.

    చాబహార్ పోర్టు భారత్‌కు అఫ్ఘానిస్తాన్, మధ్య ఆసియా దేశాలతో నేరుగా వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకునే ప్రత్యామ్నాయ మార్గాన్ని కల్పిస్తుంది.

    అదే సమయంలో, ఐఎన్‌ఎస్‌టీసీ ప్రాజెక్టు ద్వారా రష్యా, ఐరోపా దేశాలకు సరుకుల రవాణాకు అవసరమయ్యే సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

    ఈ నేపథ్యంలో ఇరు దేశాల కీలక భద్రతా అధికారులు నిర్వహించిన తాజా చర్చలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు భావిస్తున్నారు.

    రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుల పురోగతి మరింత వేగవంతం కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు

    India's National Security Advisor Ajit Doval held a significant phone conversation with Dr. Ali Akbar Ahmadian, Iran’s top security official.

    "During the call, Mr. Doval emphasized Iran’s constructive role in the region and expressed India’s interest in expanding bilateral… pic.twitter.com/0HrAE0u550

    — TIMES NOW (@TimesNow) May 19, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అజిత్ దోవల్‌

    తాజా

    Ajit Doval: భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు.. చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్‌పై అజిత్ దోవల్ దృష్టి అజిత్ దోవల్‌
    Tax Saving Schemes: పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్స్‌ను తప్పక పరిశీలించండి! పోస్టాఫీస్
    Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు  ఆఫ్ఘనిస్తాన్
    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర

    అజిత్ దోవల్‌

    NSA Doval: సుల్లివన్‌తో దోవల్ ఫోన్ సంభాషణ.. ప్రపంచ సవాళ్లపై చర్చ  భారతదేశం
    Ajit Doval Vladimir Putin: రష్యా ముందుకు ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక.. పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ.. యుద్ధం ఆగుతుందా?  వ్లాదిమిర్ పుతిన్
     Modi-Ajit Doval: మరోసారి ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ సమావేశం  నరేంద్ర మోదీ
    Ajit Doval: ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్‌కు లేదు.. కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం: అజిత్‌ దోవల్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025