NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే? 
    తదుపరి వార్తా కథనం
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే? 
    అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?

    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే? 

    వ్రాసిన వారు Stalin
    Jun 03, 2023
    12:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.

    ఇది దేశంలోనే అత్యంత విపత్కర సంఘటల్లో ఒకటిగా నిలిచిపోయింది. అయితే మూడు రైళ్లు(బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు) ఢీకొనడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

    ఇప్పటి వరకు ఈ రైలు ప్రమాదంలో 290మంది మృతి చెందగా, 900మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

    ఇంతటి ఘోరమైన ప్రమాదం ఎలా జరిగింది? అసులు ఈ మూడు రైళ్లు ఎలా ఢీకొన్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

    రైలు ప్రమాదం

    ప్రత్యక్ష సాక్షులు, అధికారులు ఇలా చెప్పారు

    రైల్వే అధికారులు, ప్రత్యేక్ష సాక్షులు ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. ఈ ప్రమాదం అంతా నిమిషాల్లో జరిగినట్లు చెప్పారు.

    షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 6:30 గంటలకు బాలాసోర్ చేరుకుంది. సుమారు రాత్రి 7:20 గంటలకు బాలేశ్వర్ సమీపంలో రైలు 10 నుంచి 12 బోగీలు పట్టాలు తప్పాయి. అవి ఎదురుగా ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి.

    ఎదురుగా ఉన్న ట్రాక్‌పై పడిపోయిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను కొద్ది సేపటికి వేగంగా దూసుకొచ్చిన బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులోని నాలుగు బోగీలు బోల్తా పడిపోయాయి.

    ఈ బోగీలను కొద్ది సేపటికే వచ్చిన గూడ్స్ రైలు వచ్చి ఢీకొంది. అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది.

    రైలు ప్రమాదం

    రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ 

    మరోవైపు ఒడిశా రైలు దుర్ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ జరుపుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైలు భద్రతా కమిషనర్ స్వతంత్ర విచారణ కూడా చేస్తారని వెల్లడించారు.

    ఈ ఘోర రైలు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారాన్ని సంతాప దినంగా ప్రకటించారు.

    ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. , మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి అందజేస్తామని ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    రైలు ప్రమాదం
    రైల్వే శాఖ మంత్రి
    అశ్విని వైష్ణవ్

    తాజా

    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  భారతదేశం

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025